DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మూడు ముక్కల రాజధానికి ప్రజామోదం కోరండి, మాజీ ఎంపీ

*ప గో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, తోట సీతారామలక్ష్మి* 

DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)

అమరావతి, ఆగస్టు 03, 2020 (డిఎన్ఎస్):  2014 లో రాష్ట్ర విభజన- ఎన్నికల్లో తెలుగదేశం గెలుపు- అప్పట్లో రూ.16 వేల కోట్ల ఆర్థిక లోటు- అవశేష అప్పులు రూ.30 వేల కోట్లు భారం రాష్ట్రంపై- 13 జిల్లాల సమగ్ర అభివృధి కి బృహత్

ప్రణాళిక. రాజధాని లేని పరిస్థితులలో రాష్ట్రానికి నడిబొడ్డున అన్ని జిల్లాలకు అందుబాటులో అమరావతి ఎంపిక- కేంద్రం చట్టం ఏపీ రీఆర్గ నైజైషన్ యాక్ట్ 2014 ప్రకారం -  శివరామకృష్ణన్ కమిటీ సీపార్సు ప్రకారం ఎంపిక.ఆరోజు అమరావతి ని ఎవరు వ్యతిరేకించలేదు మీరు ఆహ్వానించారు అన్ని పార్టీలు సంఘాలు నియోజకవర్గాలు నుంచి మద్దతు అప్పటి

ముఖ్యమంత్రి గౌ' చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు రైతులు 33 వేల ఏకరాలు ఇచ్చారు  5 ఏళ్ల టీడీపీ హయాంలో రూ.లక్ష కోట్ల సంపద నగరంగా అమరావతి నిర్మాణం. రూ. 10 వేల కోట్లతో నిర్మాణాలు జరిగాయి వాటన్నిటినీ నిరుపయోగం చేస్తున్నారు ఎన్నికలు అయ్యాక ప్రజలతో మీ అవసరం తీరాక ఇప్పుడు దొంగచాటుగా రాజధానిని తరలిస్తున్నారు ఇంతకన్నా

మోసం ఉందా రాజధానిపై ప్రజల్లో మెండట్ తీసుకునే ధైర్యం మీకు ఉందా..? రాజ్యాంగబద్ధంగా చెయ్యాలి మీరైనా మేమైన .. ఇప్పుడు రాజధాని తరలింపులో 3 ముక్కలు చేయడంలో ప్రజల ప్రమేయం ఉందా? ఎవరైనా అడిగారా? విశాఖపట్నం నీ దేశంలో ప్రధాన నగరంగా చేసింది టీడీపీ ప్రభుత్వమే  కరువు సీమ అనంతపురంలో కియా కార్లు పరిగేతించాం కర్నూలు లో మెగా సీడ్

పార్కు దేశంలో మొబైల్ ఫోన్లు అత్యధికంగా తయారుచేసే జిల్లా గా చిత్తూరు కడప స్టీలు ప్లాంటు ఇది టీడీపీ దక్షత రాష్ట్రంలో వైసీపీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారయింది రాజధాని మూడు ముక్కలు చేయాలన్న మీ నిర్యనికి ప్రజామోదం మళ్లీ కోరండి మీ నిర్ణయం పై మీకు నమ్మకం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళండి మీ నిర్ణయాన్ని ప్రజలు

ఆమోదిస్తే మీ నిర్ణయాన్ని మేమే కాదు ఎవరూ ప్రశ్నించరు. 48 గంటల్లో చంద్రబాబు నాయుడు గారి సవాల్ ను స్వీకరించండి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam