DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆన్ లైన్ లో ఈ-రక్షాబందన్  వీక్షించిన జిల్లా వాసులు.

*రాష్ట్ర సి.ఐ.డి వారి యూ ట్యూబ్ ఛానల్ లో ప్రసారం* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  ఆగస్టు 03, 2020 (డిఎన్ఎస్):*

రాష్ట్రంలో ఉన్న.. మహిళలు,విద్యార్థినిలు,బాల బాలికలు మరియు గృహిణిలు సైబర్ నేరాల ఉచ్చులో పడకుండా రక్షణగా రాష్ట్ర పోలీసు-సి.ఐ.డి విభాగం మరియు సైబర్

పీస్ ఫౌండేషన్ వారు రూపొందించిన  "ఈ-రక్షాబందన్ " ను రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం నాడు రాఖీ పండగా సందర్భంగా ప్రారంభించారు. సీఎం క్యాంపు కార్యాలయం నుండీ నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర సి.ఐ.డి విభాగం వారి యూ ట్యూబ్ ఛానల్ లైవ్ ద్వారా జిల్లావాసులు విరివిగా

వీక్షించారు. విద్యార్థులు, రైతులు, వర్తకులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు... ఇలా పలు వర్గాల ప్రజలు ఈకార్యక్రమాన్ని లైవ్ లో చూశారు. జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దర్ జిల్లా పోలీసు కార్యాలయం నుండీ... డీఎస్పీలు, సి.ఐలు , ఎస్సైలు, మహిళా పోలీసులు ఆయా పోలీసు స్టేషన్లు, కార్యాలయాల్లో ఉంటూ వీక్షించారు. సీఎం గారు ప్రారంభించిన ఈ

రక్షాబంధన్ కార్యక్రమానికి సంబంధించిన యూ ట్యూబ్ ఛానల్ ను జిల్లా వ్యాప్తంగా 32 వేల  మందికి పైగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఈ రక్షాబంధన్ కార్యక్రమం ద్వారా మహిళలు ,బాలికలు  సైబర్ నేరాల వలలో చిక్కకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు... సైబర్ నేరం చోటు చేసుకున్నప్పుడు ఏ విధంగా స్పందించి ఎదుర్కోవాలి, తదితర అంశాలుపై సైబర్

నిపుణులచే ఈనెల ఆఖరు వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుండి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆన్‌లైన్ కార్యకలాపాలు సైబర్‌ / ఆన్‌లైన్ భద్రతా అవగాహనను వెబ్‌నార్లు, రేడియో ప్రోగ్రామ్‌లు, నిపుణుల నుండి సైబర్ చర్చలు మరియు సర్వేలు, క్విజ్, నినాద రచన పోటీలు వంటి ఇతర ఆకర్షణీయమైన కార్యకలాపాలు నిర్వహించబడుతాయి.


సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ సాంకేతికత వినియోగించే టప్పుడు అప్రమత్తత అవగాహన అవసరమని ,మొబైల్ వినియోగం పెరగడంతో మహిళలు , విద్యార్ధినులు , బాలలు చేసే చిన్న చిన్న తప్పుల వలన ఏవిధంగా వేధింపులకు గురవుతున్నారు . వాటిని ఏవిధంగా ఎదుర్కోవాలి , ఎవరికి ఫిర్యాదు చెయ్యాలి అన్న విషయాలపై అవగాహన కల్పించి , మహిళల రక్షణకు

చర్యలు చేపట్టి , వారికి అండగా నిలిచేందుకుగాను “ ఈ - రక్షాబంధన్ 4 ఎన్ ” అనే కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకొని సైబరు నేరాల పట్ల అవగాహన పెంచుకొని , మోసాలకు గురి కాకుండా ఉండాలన్నారు. కావున ఈ నెల ఆఖరి వరుకు జరుగుతున్న ఈ - రక్షాబంధన్ కార్యక్రమాన్ని వీక్షించడం ద్వారా అందులో

 మహిళలుకు ఉపయోగపడే  మెలకువలోనూ తెలుసుకొని సైబరు నేరాల నుండి మహిళలు , బాలలకు రక్షణ , భద్రత కల్పించికోవచ్చునని జిల్లా ఎస్పీ గారు తెలియజేసినారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam