DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అయోధ్య రామ మందిర భూ పూజకు చిన్న జీయర్ స్వామికి ఆహ్వానం.

*ఆహ్వానం అందినా వెళ్లే జీయర్లు, సాధువులు పాల్గొనే అవకాశం తక్కువే*

*చాతుర్మాస్య దీక్ష లో ఉండే వారు ఆ గ్రామం పొలిమేర దాటరాదు.* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 04, 2020 (డిఎన్ఎస్):* నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఏర్పాట్లు జరుగుతున్న అయోధ్య లోని శ్రీ రామ

మందిర భూ పూజ మహోత్సవం లో పాల్గొనవలసిందిగా ప్రాముఖ్య ఆధ్యాత్మికవేత్త, ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు, అపర రామనుజులు గా ప్రసిద్ధి కెక్కిన  చిన్న జీయర్ స్వామి ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే ప్రస్తుతం జీయర్ స్వామి ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు సమీపంలోగల నడిగడ్డపాలెం శ్రీ వాసుదాసాశ్రమం లో చాతుర్మాస్య దీక్షలో

ఉన్నారు. సెప్టెంబర్ నెల వరకూ సాగే ఈ దీక్ష లో గ్రామా పొలిమేర దాటకూడదని, ఒకవేళ దాటినా రాత్రి ఆరాధన సమయానికి తిరిగి దీక్ష ప్రాంగణానికి చేరుకోవాలి అనే నియమం ఉన్నందున స్వామిజి ఈ వైభవంలో పాల్గొంటారా లేదా అనేది సందేహంగానే ఉంది. అయితే చిన్న జీయర్ స్వామి ఆశ్రమం లో ప్రధాన ఆరాధన పెరుమాళ్ శ్రీరామచంద్రులు కావడంతో, ఈ మహోత్సవం

పాల్గొనే అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. ఒకవేళ పాల్గొన్నా సాయంత్రానికి తిరిగి ఆశ్రమానికి చేరుకుంటారని తెలుస్తోంది. 
ఈ వేడుకలకు ముఖ అతిధిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానుండడంతో సామాన్య ప్రజలు ఎవ్వరికి ఆహ్వానం లేదు. కేవలం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ అనుమతించిన వారికే ఆహ్వానం పంపడం

జరిగింది. 

ఇతరులకూ ఆహ్వానం. . .

ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఇతర సాధువులు, పీఠాధిపతులను కూడా ఈ మహోత్సవం లో పాల్గొనేందుకు అయోధ్య రామ మందిర నిర్మాణ కమిటీ ఆహ్వాన పత్రికలూ పంపారు. అయితే వీరు కూడా చాతుర్మాస్య దీక్షలో ఉన్నందున ప్రస్తుత మహోత్సవం లో పాల్గొనలేమంటూ సమాచారం పంపినట్టు తెలుస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam