DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉత్తరాంధ్ర కంచుకంఠం. .మారుమ్రోగుతూనే ఉంటుంది

*పాట ఉన్నంత కాలం కళాకారులూ చిరకాలం జీవించే ఉంటారు.*

*ఏం పిల్లడో వెళ్దాం వస్తావా...అన్నావు. వచ్చేదాకా ఆగలేదు. . .*  

*ప్రజా స్వరం భౌతిక నిష్క్రమణ పట్ల పలువురి సంతాపం :. ..* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 04, 2020 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర పేరు

చెప్పగానే మొత్తం తెలుగు ప్రజలందరికీ వెంటనే స్ఫురణకు వచ్చే ఒక కంచుకంఠం. ఆ స్వరం వినగానే నిస్తేజం లో ఉన్న వాళ్లకి సైతం ఉత్సాహం వచ్చి కళ్ళతో స్టెప్పులు వేయించే తాయత్తు. ఒక్కసారి ఆ స్వరం వింటే మరిచిపోకుండా ఉండే గొంతు అది. 

నేడు ఆ స్వరం భౌతికంగా మూగపోయింది. అయినప్పటికీ నేటికీ కంచుకంఠం తెలుగు ప్రజా చెవుల్లో

మారుమ్రోగుతూనే ఉంటుంది.  పాట ఉన్నంత కాలం కళాకారులూ చిరకాలం జీవించే ఉంటారు అనడానికి ఇలాంటి కళాకారులే ఉదాహరణ. 

ఏం పిల్లడో వెళ్దాం వస్తావా...అని పాడారు . . ఆ పిలుపు విన్న అభిమానులు వచ్చేదాకా ఆగలేదు ఏంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎవరు ఏ స్థాయిలో ఉద్యమం, పోరాటం,

సభలు, సమావేశాలు నిర్వహించినా కచ్చితంగా వినిపించే పాట వెంట గజ్జెల సవ్వడి, కనిపించే దృశ్యాలు. 

ఉత్తరాంధ్ర ప్రజా స్వరం తో సాహిత్య రంగానికి చేసిన కృషి కి గుర్తింపుగా ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఈయనను గౌరవ అధ్యాపకునిగా స్వాగతం పలికి, తన స్థాయిని మరింత పెంచుకుంది. 

ప్రజా స్వరం భౌతిక నిష్క్రమణ పట్ల

పలువురి సంతాపం :. .. 

ఉత్తరాంధ్ర ప్రజల ప్రజా స్వరం భౌతిక నిష్క్రమణ పట్ల ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు, జాతీయ పాత్రికేయుల సంఘం కార్యదర్శి, విజేఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు,

 ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, తదితరులు సంతాపాన్ని తెలియచేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam