DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆగస్టు 15 నాటికి గిరిజన భూములు పట్టాలు అందించాలి

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 04, 2020 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా మన్యంలోని అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం సాగులో ఉన్న భూములకు నిబంధనలకు అనుగుణంగా  పత్రాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్

 ప్రకాష్  ఆదేశించారు. ప్రత్యేక హెలికాఫ్టర్ లో 
 మంగళవారం జిల్లాలోని రంపచోడవరం ప్రాంతంలోని డిగ్రీ కళాశాలకు చేరుకున్నారు.  ఈ సందర్భంగా జిల్లా కలక్టర్ డి. మురళీధర్ రెడ్డి, స్థానిక అధికారులతో సమావేశమయ్యారు. ఆగస్టు 15 నాటికి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి భూములను ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఆదేశించారన్నారు. గిరిజనులు అడవి తల్లిని, అటవీ భూములను నమ్ముకుని నిత్యం కొండా కోనల్లో జీవనాన్ని సాగిస్తున్నారన్నారు. వీటికి అటవీ హక్కుల చట్టం ఒక వరంగా మారి అండగా నిలుస్తోందన్నారు. జిల్లాలో రానున్న 4 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని ఏడాదికి రూ. 5 వేలు చొప్పున భూసేకరణ చేపట్టాలన్నారు. 
గిరిజన సంక్షేమ శాఖా ముఖ్య

కార్యదర్శి కాంతిలాల్ దండే వనసంరక్షణ సమితులకు చెందిన భూములపై ఏవిధంగా కమ్యూనిటీ హక్కుల సంక్రమణ విధానాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ కు వివరించారు.   
ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు రంజిత్ భాషా, అటవీశాఖ అదనపు ప్రిన్సిపాల్ చీఫ్ లు శ్రీధర్, ఏకే ఝా, సంయుక్త కలెక్టర్ జి.

లక్ష్మీశ, అటవీ శాఖాధికారి నాగేశ్వర రావు, జిల్లా అటవీ శాఖాధికారి సునీల్ కుమార్ రెడ్డి, ఐటిడిఎ పిఓ, ప్రవీణ్ ఆదిత్య, ఏ. వెంకటరమణ, ఏఎస్పీ బిందు మాధవ్, తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam