DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫ్యాక్టరీ ప్రమాదాల నివారణకు సేఫ్టీ పాలసీ ప్రతిపాదన 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 04, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లోని పరిశ్రమల భద్రత కోసం ప్రస్తుతమున్న  రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ సేఫ్టీ పాలసీ కిందకు తీసుకు వచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసారు. మంగళవారం నిర్వహించిన పారిశ్రామిక

ప్రమాదాలపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష సమావేశంలో అయన ఉన్నతాధికారులకు పలు సూచనలు చేసారు. ఏడాదికి రెండు సార్లు కాంప్లియన్స్‌ నివేదికలు చెయ్యాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యాక్టరీలపై బలమైన పర్యవేక్షణ యంత్రాంగం ఉందన్నారు. థర్డ్‌పార్టీ తనిఖీలు కూడా చేయాలన్నారు. పారిశ్రామిక ప్రమాదాలపై

క్యాంపుకార్యాలయంలో సమీక్షా సమావేశంలో సీఎం తెలిపారు. 

ఈ సమావేశంలో పర్యావరణ శాఖ స్పెషల్‌ చీఫ్‌సెక్రటరీ నీరబ్‌ ప్రసాద్, పరిశ్రమల శాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌ సహా ఇతర అధికారులు హాజరు అయ్యారు. వీరు తీసుకున్న నిర్ణయాలు . .. 

–రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల్లో తనిఖీలు

చేస్తున్నామని వెల్లడించిన అధికారులు
స్పెషల్‌డ్రైవ్‌ ముమ్మరంగా సాగుతోందని తెలిపిన అధికారులు
–వచ్చే రెండు మూడు నెలల్లో ఈ తనిఖీలు పూర్తిచేస్తామన్న అధికారులు

–పరిశ్రమల్లో భద్రత, ప్రమాదాలు, కాలుష్య నివారణ అంశాలపై సమావేశంలో విస్తృత చర్చ
–కొత్తగా ఇండస్ట్రియల్‌ సేఫ్టీ పాలసీ తీసుకురావాలని

ప్రతిపాదించిన అధికారులు 
–పరిశ్రమల భద్రత కోసం ప్రస్తుతం ఉన్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ కూడా ఈ సేఫ్టీ పాలసీ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయం

–అలాగే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని పరిశ్రమలు, ఇండస్ట్రియల్‌ పార్కులను వీటన్నింటినీ సూచిస్తూ ఇండస్ట్రియల్‌ అట్లాస్‌ రూపొందించాలని నిర్ణయం
/> –ఎలాంటి పరిశ్రమలు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయన్నదానిపై ఈ అట్లాసులో వివరాలు 
–పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారు కూడా.. కేటగిరీ ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నదానిపై ఈ అట్లాస్‌ ద్వారా వివరాలు
–పరిశ్రమలు దాఖలు చేసే కాంప్లియన్స్‌ నివేదికలను ఏడాదికి రెండు సార్లు ఇచ్చేలా చూడాలన్న సీఎం
–వీటిపై

ఎలాంటి చర్యలు తీసుకున్నామన్న అంశాన్ని సంబంధిత కంపెనీలు బోర్డులపై పెట్టాలి: సీఎం
–థర్డ్‌పార్టీ తనిఖీలు కూడా వీటిపై ఉండాలి
– కేవలం పరిశ్రమల్లోనే కాకుండా ఇండస్ట్రియల్‌ పార్కుల్లో కూడా నిబంధనలు అమలవుతున్నాయా? లేదా? చూడాలి
– పర్యవేక్షణ యంత్రాంగం బలంగా ఉండాలి:
– విశాఖ గ్యాస్‌ దుర్ఘటనలో

ఇన్‌హెబిటర్స్‌ (నిరోధం) ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదు:
– ఎవ్వరూ పర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఈసమస్య వచ్చింది:
– అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో కాంప్లియన్స్‌ నివేదిక ఇవ్వకపోతే భారీ జరిమానాలు వేస్తారు:
– మన దగ్గర ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు:
– మనం కూడా ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండాలి:


పారిశ్రామిక ప్రమాదాలకు బాధ్యులైన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి:
– ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.50లక్షల పరిహారం ఇచ్చేలా విధానంలో పొందుపరచాలని తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam