DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అభిజిత్ లగ్నంలో అయోధ్యలో ఆదర్శంగా అద్భుతమైన ఆరంభం

*శాస్త్రోక్తంగా అయోధ్య భవ్య రాముని ఆలయ భూమి పూజ*

*కోట్లాది హిందువుల మనోవాంఛకు తోలి అడుగు పడింది.* 

*పటిష్టమైన రక్షణ ఏర్పాట్ల మధ్య తొలి సేవకుని సారధ్యంలో . . .* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 05, 2020 (డిఎన్ఎస్):* బుధవారం అయోధ్య వేదికగా అభిజిత్

లగ్నంలో మధ్యాహ్నం ( గం 12 :40 నిమిషాలకు)  అందరికి ఆదర్శంగా అద్భుతమైన ఆరంభానికి శ్రీకారం చుట్టబడింది. కోట్లాది హిందువుల మనోవాంఛ ను నిజం చేసేందుకు  తోలి అడుగు పడింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శాస్త్రోక్తంగా అయోధ్య భవ్య రాముని ఆలయ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి

ఆదిత్యానాద్, గవర్నర్ ఆనంది బెన్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ( ఆర్ ఎస్ ఎస్) సర్ సంఘ్ చాలక్ ( చీఫ్ ) మోహన్ భగవత్, అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ అధ్యక్షులు గోపాల్ దాస్, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాదు, సంత్ లు పరిమితి సంఖ్యలో పాల్గొన్నారు. 
ఈ కార్యక్రమం లో భాగంగా తొలుత హనుమాన్ గడి మందిరం లో ప్రధాని స్వామిని ప్రార్ధించి,

ఈ ఆలయ నిర్మాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు శక్తి ని ప్రసాదించాలని, యావత్ భారత్ దేశాన్ని సురక్షితంగా కాపాడాలని ప్రార్ధించారు. అనంతరం ఆలయ ప్రాంగణం లో పారిజాత మొక్కను నాటారు. తదుపరి ప్రధాన వేదిక వద్ద ఏర్పాటు చేసిన భవ్య రాముని ఆలయ నిర్మాణానికి ఏర్పాటు చేసిన ప్రదేశంలో భూమి పూజ నిర్వహించారు. తదుపరి జాతిని

ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రామాలయ నిర్మాణం కోసం కల్గిన అడ్డంకులను తొలగడానికి ఎన్నో అవాంతరాలు కలిగాయని, ఈ క్రమంలోనే ఎందరో కరసేవకులు ప్రాణాలు సైతం బలయ్యాయన్నారు. వారందరిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam