DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అయోధ్య రామాలయ ఏర్పాటులో అజ్ఞాత సేవకులేందరో

*ఇల్లు అమ్మి కోర్టు కేసుకు కట్టిన మహనీయులు పుల్లారెడ్డి. . .*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 05, 2020 (డిఎన్ఎస్):* కోట్లాది మంది హిందూ భక్తుల మనోవాంఛ తీర్చడానికి కనిపించని అజ్ఞాత శ్రీరామ సేవకులు ఎందరో ఉన్నారు. వారిలో అత్యంత కీలక పాత్ర పోషించిన వారు ప్రఖ్యాత

పుల్లారెడ్డి స్వీట్సు అధినేత జి. పుల్లారెడ్డి. అయోధ్య రామాలయ ఏర్పాటు కోసం సుప్రీం కోర్టు లో కేసు వేసి వాదనలు వినిపించేందుకు ఆర్థికంగా అందరూ చేతులెత్తేసిన సమయానికి పుల్లారెడ్డి విశ్వహిందూ పరిషత్ కోశాధికారి గా ఉన్నారు. 
కేసు లో వాదనలు వినిపించేందుకు రమారమి  రూ. 25 లక్షల ఖర్చు అవుతుందన్న విషయం తెలుసుకున్న

పుల్లారెడ్డి, నాటి అధ్యక్షులు అశోక్ సింఘాల్ ను తన ఇంటికి ఆహ్వానించి ఎప్పడికప్పుడు తన చేతిలో ఉన్న రూ. 2 లక్షలు, తన శ్రీమతి (భార్య నారాయణమ్మ ) మెడలో నగలు కూడా తీసి ఇచ్చి సింఘాల్ చేతిలో పెట్టి, సాయంత్రానికి మరో 10 ఇస్తానని హామీ ఇచ్చారు. అంతే కాక తన ఇంటి ని (ఎర్రమంజిల్లో ఉన్న తన ఇంటి ముందుకు తీసుకువచ్చి అశోక్ జి చేతులు

పట్టుకొని ...) చూపించి తన ఇంటిని కూడా అమ్మెందుకు సిద్ధంగా ఉన్నానని, ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీరామ జన్మ భూమిలో శ్రీరాముడికి మందిరం నిర్మాణం జరిగి తీరాల్సిందేనన్నారు. తానూ విశ్వ హిందూ పరిషత్ కోశాధికారిగా ఉండగా, డబ్బుకు లోటు రానివ్వన్నని, లోకాలని ఏలే రాముడు పేదవాడు కాదన్నారు. తనలాంటి సేవకులు ఎక్కడో ఉంటారన్నారు.

దాంతో అశోక్ సింఘాల్ ఆనంద భాష్పాలతో కంట తడి పెట్టడం ఒక్కటే మిగిలింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam