DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కే.ఆర్. స్టేడియం పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

*శాప్ ఎండీతో ఉప ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  ఆగస్టు 05, 2020 (డిఎన్ఎస్):*  అంతర్జాతీయ హంగులతో జిల్లా కేంద్రంలో నిర్మాణం జరుపుకుంటున్న కోడి రామ్మూర్తి స్టేడియం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి

ధర్మాన కృష్ణదాస్ ఆదేశించారు. స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) మేనేజింగ్ డైరెక్టర్ బి రామారావు, అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.వెంకటరమణలతో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి బుధవారం సాయంత్రం సమీక్షించారు. జిల్లాలో ప్రగతిలో ఉన్న పలు స్టేడియంలు, క్రీడా వికాస కేంద్రాల పనుల ప్రగతిని గురించి అడిగి

తెలుసుకున్నారు. సకాలంలో వాటిని పూర్తి చేయడం లేదనే ఫిర్యాదులు రాకూడదని, నిధుల సమస్య వాటికి ఉండకూడదని చెప్పారు.  జిల్లా కేంద్రంలో ఒలింపిక్ భవన నిర్మాణానికి వీలైనంత త్వరగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలస లో నిర్మిస్తున్న క్రీడా వికాస కేంద్రం ప్రాంగణాన్ని త్వరితగతిన

పూర్తిచేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. అలాగే నరసన్నపేట క్రీడా వికాస కేంద్రానికి సంబంధించి రెవిన్యూ శాఖతో ఉన్న అడ్డంకులను తొలగించామని, పనులు వేగవంతం చేయాలని ధర్మాన కృష్ణదాస్ ఆదేశించారు.  ఇంకా జిల్లాలో ఆయా నియోజకవర్గ కేంద్రాలలో నిర్మాణం జరుపుకుంటున్న మినీ స్టేడియంలు త్వరిత గతిన పూర్తి

చేయాలని, ఇంకా పెండింగ్ లో ఉన్న అంశాలపై దృష్టి సారించాలని చెప్పారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam