DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇసుక అక్రమ తరలింపు పై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏలూరు డిఐజి 

*కరోనా విజేతలతో ఏలూరు డిఐజి మోహనర్ రావు ఆత్మీయ భేటీ.. .*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 06, 2020 (డిఎన్ఎస్):* ఏలూరు రేంజ్ డిఐజి కె వి మోహన్ రావు స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులతో  ఇసుక అక్రమ రవాణా గురించి  ఇసుక రిచ్ ల  నుండి అక్రమ తరలింపు పై ఏలూరు రేంజ్ అధికారులతో

వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గురువారం జరిగిన ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ హైదరాబాదు, విశాఖపట్నం ప్రాంతాలకు తరలిపోకుండా ఇసుక చెక్పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలి అని సూచించారు. అధికారులు  నిరంతరం ఇసుక రవాణాపై నిఘా ఉంచాలని, ఇసుక రీచ్ ల లో జరుగుతున్న అవకతవకలను గురించి, ఎక్కువ మొత్తంలో ఇసుకను బుక్

చేసుకునే వారి పట్ల, ఒక వ్యక్తి  ఎక్కువసార్లు ఇసుకను బుక్ చేసుకున్న ఘటనలపై ద్రుష్టి పెట్టాలన్నారు. డబల్ బిల్లింగ్, నకిలీ రసిదులు ద్వారా ఇసుకను రవాణా  గురించి, లారీలలో అధిక మొత్తంలో  లోడ్ చేసి  పంపుతున్న విషయాలపై, ఇసుక ను ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా నిఘా ఉంచాలని తెలిపారు. ఇసుక రీచ్ ల నుండి  స్టాక్ పాయింట్లు

వద్దకు వెళ్లకుండా దారి మళ్ళించే అక్రమ దారుల పట్ల నిఘా ఉంచాలని, ఇసుక రీచ్ ల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయకుండా ఆకస్మిక తనిఖీలు అధికారులు నిర్వహించాలని,తెలంగాణ రాష్ట్రం నుండి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాము ల నుండి  జిల్లాలోకి అక్రమ మద్యం రవాణా ఉక్కుపాదం మోపాలని అని డి. ఐ.జి గారు అధికారులకు ఆదేశాలు

ఇచ్చారు.

ఈ సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్, రాజమండ్రి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పి శ్రీమతి రమాదేవి గారు, తూర్పు గోదావరి జిల్లా స్పెషల్ ఫోర్స్ మెంట్ అదనపు ఎస్పీ డాక్టరు గరుడ్ సుమిత్ సునీల్  మరియు కృష్ణాజిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ వకుల్

జిందాల్ పాల్గొన్నారు. 

కరోనా విజేతలతో ఆత్మీయ భేటీ.. .

అనంతరం కృష్ణ  జిల్లాలలో Covid - 19 కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి హాస్పిటల్స్ నందు ఐసోలేషన్ / క్వారంటైన్ లేదా హోమ్ ఐసొల్యూషన్ / కోవిడ్ సెంటర్లో క్వారంటైన్ లలో ఉన్న పోలీసు సిబ్బంది  యొక్క యోగక్షేమాలను గురించి కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు, అదనపు

ఎస్పీ ఏ ఆర్ సత్యనారాయణ, మచిలీపట్నం, నందిగామ అవనిగడ్డ ,నూజివీడు మరియు గుడివాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో మరియు సిఐ లతో   వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. 

 ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డి.ఐ.జి  కరోనా పాజిటివ్ వచ్చిన సిబ్బంది యొక్క  డిఎస్పీలు / సిఐలు ఎప్పటికప్పుడు వారి యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి

వాకబు చేస్తూ, వారికి కావలసిన వైద్య సంబంధమైన / ఇతర అవసరాలలో శాఖాపరంగా సహకారం అందించాలని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉత్తర్వులు, సూచనలను మేరకు, కృష్ణా జిల్లా  వ్యా  ప్తంగా ఉన్న పోలీసు సిబ్బందికి మనోధైర్యం, భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని, సిబ్బందికి   ఆత్మవిశ్వాసం కల్పించాలని, వారికి కావలసిన వైద్య పరమైన అన్ని రకాల

సౌకర్యాలను కల్పించాలని, అవసరమైతే సిబ్బందికి  అత్యున్నత స్థాయి వైద్యం అందించాలని, సిబ్బందికి  యాంటీవైరల్ మెడిసిన్స్, విటమిన్స్, డ్రైఫ్రూట్స్ మొదలైన వాటిని సిబ్బందికి అందించాలని,  డిఐజి   అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam