DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో దిశచట్టం అసలు అమల్లో ఉందా ?: చంద్రబాబు

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 06, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దిశచట్టం అసలు అమల్లో ఉందా ? అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో వెలుగు చూస్తున్న ఘటనలపై ఆయన గురువారం ఆవేదన వ్యక్తం

చేసారు. 

రాజమండ్రి రూరల్ లో అభం శుభం తెలీని 10ఏళ్ల ముస్లిం మైనర్ బాలికపై ముగ్గురు వైసిపి యువకుల అత్యాచారాయత్నాన్ని ఖండిస్తున్నాం అన్నారు. 

పైగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరింపులా? ఇదేమి పాలనా అని ప్రశ్నించారు. 

ఈ అరాచక మూకలకు ఇంత ధైర్యం ఇచ్చింది ఎవరు? ఎవరి

అండతో వీళ్ళు రెచ్చిపోతున్నారు అని మండిపడ్డారు. 

16ఏళ్ల దళిత మైనర్ బాలికపై 12మంది గ్యాంగ్ రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందే వదిలేసిన దుర్ఘటన కళ్లముందే ఉందన్నారు. 

కర్నూలులో గిరిజన మహిళను భర్త కళ్లముందే అతిదారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు. 

దిశచట్టం అసలు అమల్లో ఉందా? అని

అడిగారు. 

ఇప్పటికైనా పోలీసులు నిద్రమత్తు వీడి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam