DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విభజన హామీలు అమలు కాంగ్రెస్ వల్లే సాధ్యం.... : కిరణ్ కుమార్ రెడ్డి

రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు, కీలక నిర్ణయాలు కిరణ్ కే  ?

న్యూ ఢిల్లీ, జులై 13 , 2018 (DNS Online):  à°†à°‚ధ్ర ప్రదేశ్ విభజన సమయం లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం కేవలం కాంగ్రెస్

పార్టీ వల్లే సాధ్యపడుతుందని ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

రాహుల్ గాంధీ సమక్షంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ లో కిరణ్ కుమార్ చేరారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తమ కుటుంబం రాజకీయంగా ఎదగడానికి కాంగ్రెస్ పార్టీయే

కారణమని, తన తండ్రి కి మంత్రి పదవి, తనకు శాసన సభ స్పీకర్ గాను, తదుపరి ముఖ్యమంత్రి గా అవకాశం లభించడమే దీనికి నిదర్శనమన్నారు. విభజన సమయం లో రాజ్యసభలో సాక్షాతూ దేశ

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేసిన ప్రసంగం చట్టం తో సమానమని,దాన్ని అమలు చెయ్యాల్సిన భాద్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ

అధికారంలోకి వస్తేనే తానూ ఇచ్చిన హామీలను సంపూర్ణాంగా నెరవేర్చడం సాధ్యపడుతుందన్నారు. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విశాఖపట్నం కేంద్రంగా

రైల్వే జోన్, à°•à°¡à°ª లో స్టీల్ ఫ్యాక్టరీ, ఆంధ్ర, తెలంగాణల్లో ఎయిమ్స్  à°¤à°¦à°¿à°¤à°° కీలక నిర్ణయాలు సాధ్యపడతాయన్నారు. 
అంతకు ముందు రాహుల్ గాంధీ నాయకత్వం లో తిరిగి

అధికారం లోకి రావడానికి సహాయ శక్తులా కృషి చేస్తామని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాందీ, రఘువీరారెడ్డి, పళ్లంరాజులతో

కలిసి రాహుల్ ను కలిశారు. అనంతరం విలేకరుల సమావేశం లో అయన చేరికను ప్రకటించారు. 

ఈ విలేకరుల సమావేశం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి

ఉమెన్ చాందీ, ఆలిండియా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్ రఘువీరా రెడ్డి, పల్లంరాజు, జెడి శీలం

తదితరులు పాల్గొన్నారు. 

 

pix: courtesy to whom so ever it may concern

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam