DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీతాలే ఇవ్వలేని స్థితిలో రాజధాని మార్పు ప్రయత్నం ఏంటి?

*అధికార పార్టీ విధానాలపై నర్సాపురం ఎంపీ ఫైర్* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 08, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి తప్పుపట్టారు. అలాంటిది ఇలాంటి సమయంలో రాజధాని

మార్పు సరికాదని హితవు పలికారు. అయినా ప్రభుత్వం మారినప్పుడుల్లా రాజధాని మార్చుకుంటూపోతే బాగోదన్నారు.  ఇక రాజధానిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు సరికావన్నారు. రైతులకు న్యాయం చేయాలంటే రూ.80 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. అమరావతిలో రాజధాని వస్తుందని మధ్యతరగతి ప్రజలు దాచుకున్న సొమ్ముతో

భూములు కొన్నారన్నారు. దయచేసి వారికి ఇబ్బంది కలిగించొద్దని కోరారు. అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారో తెలపాలని ఏపీ హైకోర్టు కోరడం మంచి పరిణామం అని అభిప్రాయపడ్డారు. రాజధాని వ్యవహారంపై రిఫరెండానికి వెళ్లాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

న్యాయవ్యవస్థపై దుష్ప్రచారం ప్రభుత్వానికే నష్టం

కల్గుతుందని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. దూరదృష్టి లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా యన్నారు.  అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్‌ లాంటి వ్యక్తిని బెదిరించడం సరికాదన్నారు. తనను కూడా చాలాసార్లు బెదిరించారని గుర్తుచేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam