DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమరావతి ప్రక్కన పెట్టి విశాఖ పై పడ్డారు: మాజీ ఎంపీ 

టీడీపీ పగో జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, ఆగస్టు 08, 2020 (డిఎన్ఎస్):*  అమరావతి ప్రక్కన పెట్టి మూడు రాజధానులు అని పెట్టి విశాఖలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారని, మాజీ ఎంపీ ప గో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు తోట

సీతారామలక్ష్మి మండిపడ్డారు.  వికేంద్రీకరణ అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పెట్టిస్తున్నారు. కేవలం చంద్రబాబు అమరావతిని మొదలు పెట్టారు  దీనిని చెడగొట్టాలని ప్రయత్నం తప్ప మరేమీ కాదు. పార్టీలన్నీ రాజకీయాలు ప్రక్కన పెట్టి ఆలోచించాలి. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిచాలి. 
గుజరాత్ లో దొలేరో సిటీని 12

సంత్సరాలనుండి కడుతున్నారు. దాని ఖర్చు 30,000 కోట్లు ఇప్పటికి పూర్తి కాలేదు. ఇప్పటి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారు ప్రారంభించారు.
మన అమరావతి 50,000 ఎకరాలలో ప్రారంభించారు 3 సంత్సరాలలో అవ్వాలని కొన్ని పార్టీలు మాట్లాడటం దారుణం.
మన స్థలంలో ఇల్లు కడితేనే 2 సంవత్సరాలు పడుతుంది. అటువంటిది చంద్రబాబుగారు 3 ఏళ్ళలో ఎందుకు

కట్టలేదని అడుగుతున్నారు.
దేశంలో ఉన్న అనేక ప్రఖ్యాత చెందిన పెద్ద నగరాలు ఉన్న నేపధ్యంలో దక్షినాదిన ఉన్న  5 నగరాలలోనే అత్యధిక ఆదాయం 62% వస్తుంది.
దేశ ఆదాయం 11,00,000/- కోట్లు . ముంబై, డిల్లీ, మద్రాసు, బెంగుళూరు, హైదరాబాదు ల నుంచి  7,00,000 కోట్లు ఆదాయం అంటే దేశ ఆదాయంలో 62% ఆదాయం ఈ నగరాలనుంచే వస్తుంది.
ఇప్పుడు ఈ నగరాలలో సరైన

వసతులు లేక ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు.
ఈ నేపధ్యం లో అమరావతి రాజధానిగా ప్రకటించి ఆ సమస్యలు ఇక్కడ తలెత్తకుండా ఈ నగరాన్ని నిర్మించాలని చంద్రబాబు ప్రయత్నం చేశారు.
హైదరాబాద్ లో హైటెక్ సిటి ని నిర్మిస్తే ఈ రోజు దాన్ని తలదన్నే భవనాలు అక్కడ వచ్చి అక్కడ ఎంతో అభివృద్ధి చెందింది. అలా అభివృద్ధి చెందాలనే చంద్రబాబు తీవ్ర

ప్రయత్నం చేశారన్నారు. టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి ని వివరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam