DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్వర్ణ పాలస్ లో అగ్ని ప్రమాదం పై ప్రధాని మోడీ దిగ్రాంతి ‌

*బెజవాడ కోవిడ్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్, 11 మంది మృతి*  

*మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం :సీఎం జగన్* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 09, 2020 (డిఎన్ఎస్):* ఆదివారం తెల్లవారు ఝామున విజయవాడ లోని స్వర్ణ పాలస్ హోటల్లో (కోవిడ్ కేంద్రం)  అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని

నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ కు ఫోన్‌ చేసి ఈ ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే అధికారులనుంచి వివరాలు తెలుసుకుని ప్రధానికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం అందిస్తున్నట్టు తెలిపారు.  ఈ అగ్ని ప్రమాదం లో 11 మంది మరణించినట్టు

జిల్లా ఫైర్ అధికారుల పరిశీలనలో తెలియచేస్తున్నారు.

ఓ ప్రైవేటు హాస్పిటల్‌ స్వర్ణ పాలస్ హోటల్‌ను లీజుకు తీసుకుని అందులో కరోనా పేషెంట్లు ఉంచిందని, తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. అధికారులు వెంటనే సహాయక చర్యలను చేపట్టారు, దురదృష్టవశాత్తూ కొంతమంది మృత్యువాత

పడ్డారని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా ఇదివరకే అధికారులను ఆదేశించామన్నారు. బాధితులను అన్నిరకాలుగా ఆదుకుంటున్నామన్నారు. 

విజయవాడ స్వర్ణ ప్యాలస్ అగ్ని ప్రమాద ఘటన పై హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ కరోనా కేర్ సెంటర్ లో 40 మంది కరోనా

భాదితులు, 10 మాంది వైద్య సిబ్బంది ఉన్నట్లు తెలిసింది.

కరోనా చికిత్స పొందుతున్న వారు అగ్నిప్రమాదం భారిన పడటం చాలా బాధాకరం. వారి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలనే అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా తెలుస్తోందన్నారు. ప్రమాద ఘటనపై అన్ని ఆధారాలను సేకరించాలని అధికారులను హోంమంత్రి

సుచరిత ఆదేశించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam