DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ కేంద్రంలో అగ్నిప్రమాదం దురదృష్ట ఘటన: రాజమండ్రి ఎమ్మెల్యే

*విజయవాడ ఘటనపై రాజమండ్రి ఎమ్మెల్యే భవాని దిగ్బ్రాంతి* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 09, 2020 (డిఎన్ఎస్):* విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా ఉన్న స్వర్ణ ప్యాలెస్‍లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం చాలా బాధాకరమైన సంఘటనని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే

ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. ఈ మేరకు ఆమె ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రయివేటుగా ఇటువంటి కోవిడ్ కేర్ సెంటర్లు ఎవరైనా నిర్వహిస్తున్నప్పుడు నియంత్రణ ఉండాలని ప్రభుత్వానికి  సూచించారు. అటువంటి

భవనాలకు నియమ నిబంధనలు ప్రకారం అన్ని రక్షణ చర్యలు ఉన్నాయా...? పొరపాటున అగ్ని ప్రమాదం జరిగితే అన్ని సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా... ? లేదా... ? అనే విషయాలను పరిశీలించాలని సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్

చేశారు. అలాగే మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్వర్ణ ప్యాలెస్‍లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి భాద్యులపై తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam