DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*మానవత్వం చూపిన బెజవాడ పొలిసు సిబ్బంది కి అభినందనలు* 

*అయోమయంలో అగ్నిమాపక సిబ్బంది: . . .*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 10, 2020 (డిఎన్ఎస్):* ఆదివారం విజయవాడ లో జరిగిన సవర్ణా పాలెస్ లోని జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో విధుల్లో ఉన్న బెజవాడ పొలిసు సిబ్బంది మానవత్వం తో చేపట్టిన బాధ్యతకు అభినందనలు తెలియచేస్తున్నారు. ఈ కేంద్రంలో 
31

మంది కరోనా అనుమానిత వ్యక్తుల్లో కేవలం ఐదుగురికి మాత్రమే పాజిటివ్ ఉండగా, వారిలో ఇద్దరు మరణించడం జరిగింది. వీరి వద్ద ఉన్న ఫోన్లు మోగుతుండడంతో వాటిని బయటకు తీసి, వారి బందువులకు సమాచారం ఇచ్చేందుకు ఎవరూ సాహసం చెయ్యక పోవడంతో పొలిసు సిబ్బంది చొరవ తీసుకుని పీపీఈ కిట్లు వేసుకుని నర్సింగ్ స్టాఫ్ సాయంతో మానవత్వ

కార్త్యవ్యానికి సిద్ధపడ్డారు. మరణించిన వారి కుటుంబాలకు చెప్పటం దగ్గర నుండీ , కోవిడ్ టెస్టులు చేయించటం , శవాలను ఐన వారికప్పగించటం , రెండు + ve మృతులను తగిన జాగ్రత్తలతో అంత్య క్రియలు చేయించటం వరకూ భాద్యత వహించడం గమనార్హం. ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్టు గా వ్యాధిని వ్యతిరేకించండి, రోగిని కాదు అన్న వాక్యానికి నిదర్శనం

ఈ ఘటన. 

అయోమయంలో అగ్నిమాపక సిబ్బంది: . . .

ఈ అగ్ని ప్రమాద ఘటనలో మంటలను అదుపు చేసి, బాధితులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి , కోవిడ్ పేషెంట్లని తెలిసినా 21 మందిని రక్షించి బయటకు తీసుకువచ్చారు. ఈ సిబ్బంది లో భయం నెలకొంది. వీళ్లంతా కరోనా పాజిటివ్

వ్యక్తులు కావడంతో తమ పరిస్థితి ఏంటో ననే భయం నెలకొంది. వాళ్ళలో ఒక ఫైర్ మాన్ మా పరిసితి ఏంటో తెలియడం లేదని భోరుమన్నారు. 

వీళ్లకు భరోసా ఇచ్చి వాళ్ళ హాస్పటల్లోనే రెండు రోజులుంచి పరీక్షలు చేసి ఇంటికి పంపే ఏర్పాట్లు ఎవరైనా చేశారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam