DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోదావరిలోకి దూకిన యువకుడిని కాపాడిన హెడ్ కానిస్టేబుల్

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 11, 2020 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం జొన్నాడ గౌతమి గోదావరి పాత బ్రిడ్జి పై నుండి గోదావరిలోకి దూకిన యువకుడిని ఆలమూరు పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ (కోర్టు కానిస్టేబుల్ ) జి ప్రభాకర్ రావు ప్రాణాలకు

తెగించి కాపాడిన సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కపిలేశ్వరం మండలం అంగర గ్రామానికి చెందిన ఎర్ర రమేష్ రావులపాలెం వైపునుండి జొన్నాడ వైపు వస్తుండగా ప్రాత బ్రిడ్జి నుంచి గోదావరిలోకి పడి పోతుండగా  కొత్త బ్రిడ్జి పై రావులపాలెం వైపు వెళ్ళుతున్న  ఆలమూరు పోలీస్

స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జి ప్రభాకరరావు  సంఘటన చూసి అటుగా వెళ్తున్న లారీలను ఆపి వాటిలోనుంచి తాడుతీసుకొని కొత్త బ్రిడ్జి స్తంభాన్ని పట్టుకున్న యువకుడు రమేష్ ను స్థానికుల సహాయంతో పైకి లాగి ప్రాణాలను కాపాడాడు. హెడ్ కానిస్టేబుల్ చేసిన సాహసానికి అటుగా వెళ్తున్న ప్రజలు కొనియాడారు. కాగా యువకుడు  గోదావరిలో పడిన

సంఘటన పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి . సెల్ఫీ తీసుకుంటుండగా గోదావరిలో పడినట్లు గానూ, మరొకరు తన వెళ్లే వాహనంలో పెట్రోలు అయిపోగా పాత బ్రిడ్జి పై గల గోడపై కూర్చుని అకస్మాత్తుగా పడిపోయినట్లు గానూ, మరొకరు గోడ పైకి ఎక్కి గోదావరిలోకి దూకినట్లు గానూ కథనాలు వినిపిస్తున్నాయి ఈ సంఘటన పై సరైన నిజాలు పోలీసుల  విచారణలో

చేరవలసి ఉంది. ఏది ఏమైనా ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన ఆలమూరు హెడ్ కానిస్టేబుల్ అభినందనీయుడు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam