DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి విశాఖ కు కృష్ణదాస్ రాక

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  ఆగస్టు 11, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లా నుంచి తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి హోదా పొందిన నేత ధర్మాన కృష్ణదాస్. ఇటీవల ఆయనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉపముఖ్యమంత్రిగా నియమిస్తూ, రాష్ట్ర పాలనలో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖని

అప్పగించారు. ఎంతో రాజకీయానుభవం, కార్యదక్షత గల ధర్మాన కృష్ణదాస్ కు ఈ పదవులను అప్పగించడంలో సీఎం జగన్ సముచితమైన నిర్ణయాన్ని తీసుకున్నారని  ఇప్పటికీ జిల్లావాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ధర్మాన కృష్ణదాస్ తొలిసారిగా జిల్లాలో అడుగుపెడుతుండడం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఆయన అభిమానులకు ఎంతో సంతోషం కలిగిస్తోంది.

 అయితే కోవిడ్-19 విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా సంబంధిత నిబంధనలు పాటిస్తూనే తమ అభిమాననేత దాసన్నని కలవడానికి వారంతా చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అమరావతి నుంచి మంగళ వారం ఉదయం బయలుదేరిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన

కృష్ణదాస్ సాయంత్రం విశాఖ చేరుకుంటున్నారు. అక్కడే  సర్క్యూట్ అతిధి గృహంలో బస చేసి సందర్శకులకు అందుబాటులో ఉంటారు. బుధవారం ఉదయమే విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం బయలుదేరనున్నారు.  కృష్ణదాస్ రాక కోసం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గం పైడి భీమవరం వద్ద పార్టీ నాయకులు అభిమానులు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు

చేస్తున్నారు. 

 పైడి భీమవరం నుంచి నుంచి నేరుగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటారు. రాష్ట్రంలో బీసీ ఎస్సీ, ఎస్టీ మహిళలకు సంబంధించిన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. వీడియో కాన్ఫరెన్ అనంతరం

మధ్యాహ్నం 1 గంట నుంచి 4గంటల వరకూ ఆర్ అండ్ బి అతిధి గృహంలో సందర్శకులకు ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ అందుబాటులో ఉంటారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam