DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాంచి పీటీఐ బ్యూరో చీఫ్ పీవీ రామానుజం ఆత్మహత్య

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 13, 2020 (డిఎన్ఎస్):*

రాంచీ: కొవిడ్-19 సంక్షోభం, లాక్‌డౌన్ నేపథ్యంలో ఇటీవల చోటుచేసుకుంటున్న అనేక విషాదాలు గుండెలు పిండేస్తున్నాయి. సీనియర్ జర్నలిస్టు, పీటీఐ బ్యూరో చీఫ్ పీవీ రామానుజం ఇవాళ తన నివాసంలో విగతజీవిగా కనిపించారు. తన ఆఫీస్ కమ్

రెసిడెన్స్‌లో ఓ సీలింగ్ ఫ్యాన్‌కు ఆయన ఉరివేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. రామానుజానికి భార్య, ఓ కుమారుడు ఉన్నారు. రాజ్‌భవన్‌కు సమీపంలోని ఓ ప్రభుత్వ భవనంలో రాంచీ పీటీఐ కార్యాలయం నడుస్తోంది. బుధవారం రాత్రి తన చాంబర్‌లోకి వెళ్లిన ఆయన మళ్లీ తిరిగి రాలేదు. ఉదయాన్నే ఆయన సతీమణి వెళ్లేసరికి ఉరికి వేలాడుతూ

కనిపించారు. శుక్రవారం ఆయన అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

రాంచీ ఎస్పీ నౌషద్ అలమ్ అన్సారీ మాట్లాడుతూ... ‘‘గత నాలుగైదు రోజులుగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు ఆయన భార్య చెప్పారు. తదుపరి విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశాం..’’ అని పేర్కొన్నారు.

కాగా సీనియర్ జర్నలిస్టు రామానుజం ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని రాంచీ ప్రెస్ క్లబ్ సభ్యుడు ఒకరు పేర్కొన్నారు. ‘‘రామానుజం చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయన ఆత్మహత్య మీడియా వర్గాలకు కనువిప్పు. జర్నలిస్టుల ప్రస్తుత పరిస్థితికి, పని ఒత్తిడికి ఇది నిదర్శనం..’’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు రామానుజం మృతి పట్ల

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, కేంద్రమంత్రి అర్జున్ ముండా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam