DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దిశ చట్టం అమలుపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 13, 2020 (డిఎన్ఎస్):* దిశ చట్టం అమలుపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష చేపట్టారు. గురువారం జరిగిన ఈ సమావేశంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ సహా అధికారులు హాజరు అయ్యారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించి

విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ప్రక్రియపై సీఎం ఆరా తీశారు. కేంద్ర హోం శాఖ వద్ద ఫైలు పెండింగులో ఉందని అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.  ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలన్న సీఎం
క్రిమినల్‌ లా లో సవరణలు చేస్తూ పంపిన బిల్లుకూ

కేంద్రం ఆమోదం వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నవైఎస్ జగన్ తెలిపారు.  ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం పైనా ఆరా తీసారూ. దిశ చట్టం కింద కేసుల విచారణకు 13 జిల్లాలో 11 మంది ప్రాసిక్యూటర్లు, పోస్కో కేసుల విచారణకు 8 మంది ప్రాసిక్యూటర్లను ప్రత్యేకంగా నియమించామన్న అధికారులు. మిగిలిన చోట్ల కూడా పబ్లిక్‌

ప్రాసిక్యూటర్లను త్వరగా నియమించాలని సీఎం సూచించారు. దిశ చట్టం, యాప్, నంబర్లకు సంబంధించిన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు, ప్రజలు ఎక్కువగా వచ్చి పోయే ప్రాంతాలు, వారు సమావేశమయ్యే చోట్ల పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని సీఎం ఆదేశించారు. ఇతర సూచనలు. . .

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ఏర్పాటుపైనా సీఎం ఆరా
/> వీలైనంత త్వరగా ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం
‘దిశ’ చట్టంను సమర్థవంతగా అమలు చేయాలన్న సీఎం
క్రమం తప్పకుండా చట్టం అమలు చేయాలన్న సీఎం
ప్రతి నెలా.. తీసుకోవాల్సిన చర్యల మీద సమీక్ష చేసుకోవాలి
దిశ యాప్‌ కింద వచ్చే ఫిర్యాదులకు క్వాలిటీ సేవలు అందాలని స్పష్టం చేసిన సీఎం
పనితీరును ఎప్పటికప్పుడు

పర్యవేక్షించాలన్న సీఎం
త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దిశ పెట్రోల్‌ ప్రారంభం
900 స్కూటర్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
సైబర్‌ సేఫ్టీ కోసం కియోస్క్‌లను ఏర్పాటు చేస్తామన్నఅధికారులు
ఫోన్, ల్యాప్‌టాప్‌ల భద్రతను పరీక్షించుకోవచ్చన్న అధికారులు
ప్రతి

పోలీస్‌స్టేషన్‌లో దిశ మహిళా హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటు
ప్రత్యేకంగా కంప్యూటర్, ఫోన్‌ నంబర్‌ ఏర్పాటు 
సైకాలజిస్ట్, ఎన్జీఓ సహా న్యాయ సహాయం కూడా లభిస్తుంది
దిశ యాప్‌ 11 లక్షల డౌన్‌ లోడ్స్‌
దిశ యాప్‌ ద్వారా 502 కాల్స్, 107 ఎఫ్‌ఐఆర్‌లు నమెదు
దిశ చట్టం కింద ఇప్పటి వరకూ 390 కేసులు నమోదు
ఈ కేసుల్లో 7

రోజుల్లోపు ఛార్జి షీటు దాఖలు 
74 కేసుల్లో శిక్షలు ఖరారు
మరణశిక్షలు 3, జీవితఖైదు 5, 20 సంవత్సరాల శిక్ష 2, 10 సంవత్సరాల శిక్ష 5, ఏడేళ్లపైన 10, 5 సంవత్సరాలలోపు శిక్షలు మిగతా కేసుల్లో
1130 కేసుల్లో ఛార్జిషీటు దాఖలు చేశాం, కాని కేసు నంబర్లు రావాలన్న అధికారులు
కోవిడ్‌ కారణంగా కోర్టుల కార్యకలాపాలపై ప్రభావం చూపిందన్న

అధికారులు
సైబర్‌ మిత్ర ద్వారా 265 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు
సామాజిక మాథ్యమాల ద్వారా వేధింపులు ఆపడానికి సైబర్‌బుల్లీ వాట్సాప్‌ నంబర్‌ ఇచ్చారు
ఇప్పటి వరకూ 27 వేల ఫిర్యాదులు వచ్చాయి
780 మంది తరచుగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని గుర్తింపు
వీరందరిపైనా కేసులు నమోదు
ఇ– రక్షా బంధన్‌ కార్యక్రమంలో భాగంగా

3.5 లక్షల మంది ఈ కార్యక్రమంలో ఇంతవరకూ పాల్గొన్నారు
సైబర్‌ నేరాలపైనా, సైబర్‌ చట్టాలపైనా అవగాహన కల్పించే కార్యక్రమం ఇది
దిశ ఒన్‌ స్టాఫ్‌ సెంటర్లు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయన్న అధికారులు
13 జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌లో ఆ సెంటర్లు పెట్టామన్న అధికారులు
జనవరి నుంచి ఆగస్టు వరకూ 2285 కేసులు

ఒన్‌స్టాప్‌ సెంటర్లకు వచ్చాయని  అధికారులు వివరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam