DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రతి రోగిని నిశితంగా పరిశీలించాలి: కలెక్టర్ నివాస్

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 13, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జెమ్సు ఆసుపత్రికి వచ్చిన ప్రతీ కోవిడ్ పేషెంటును నిశితంగా పరిశీలించాలని , సరైన వైద్యాన్ని అందించాలని జెమ్స్ ఆసుపత్రి వైద్యులకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ సూచించారు. గురువారం ఉదయం రాగోలు వద్ద గల జెమ్స్ ఆసుపత్రిని

జిల్లా కలెక్టర్ సందర్శించి, అక్కడ వైద్యులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెమ్స్ ఆసుపత్రికి వచ్చిన కోవిడ్ రోగులను తిరిగి పంపుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఏ పరిస్థితిల్లో నున్న కోవిడ్ రోగులనైనా తక్షణమే ఆసుపత్రిలో చేర్చుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా కోవిడ్ రోగులు యొక్క ఆరోగ్య

లక్షణాలను అనుసరించి వైద్యాన్ని అందించాలని, ప్రతి రోగిని నిశితంగా పరిశీలించాలని సూచించారు. 800 పడకల ఆసుపత్రి అయిన జెమ్స్ నందు తీవ్రమైన లక్షణాలతో వచ్చిన వారికోసం 10 ఐసిసియు బెడ్లతో పాటు  ఇతర బెడ్లను కూడా సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేసారు. కోవిడ్ పేషెంట్లు   ఏ సమయంలో వస్తారో తెలియనందున వారి కోసం బెడ్లతో పాటు సిబ్బంది

కూడా అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ప్రతీ ఫ్లోర్ నందు వైద్యులు, నర్సులు, సిబ్బందితో పాటు పర్యవేక్షకులు కూడా ఉండాలని , సిబ్బంది మూడు షిఫ్టుల ప్రకారం 24 గంటలు అందుబాటులో ఉండాలని తెలిపారు. పేషెంట్లకు పౌష్టికాహారం ఏర్పాటుచేయాలని, వారితో పాటు విధుల్లో ఉన్న సిబ్బందికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్

వివరించారు. ప్లాస్మా థెరఫీ ద్వారా కోవిడ్ పేషంట్లు కోలుకునే అవకాశం ఉన్నందున వీలైనంత మేర ప్లాస్మాను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతీ కోవిడ్ పేషెంటు ఆరోగ్యం మనకు ముఖ్యమని, ఏ ఒక్కరూ మరణించరాదని కలెక్టర్ స్పష్టం చేసారు. ఆసుపత్రికి అవసరమైన అదనపు సిబ్బందిని ఏర్పాటుచేస్తున్నామని, వారితో పాటు

వాలంటీర్ల సేవలను కూడా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి కోవిడ్ పేషెంట్లు ఆసుపత్రికి వస్తున్నారని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ప్రతీ ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఆసుపత్రులపై ఉందని, ఏ ఒక్క రోగి వెనుకకు తిరిగిపోరాదని తెలిపారు. తొలుత జెమ్స్ క్యాన్సర్ ఆసుపత్రి

విభాగంలో ఏర్పాటుచేసిన వైరాలజీ ల్యాబ్ ను పరిశీలించిన ఆయన త్వరితగతిన ఏర్పాట్లు పూర్తిచేయాలని, సిబ్బందికి తగిన శిక్షణ  ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా కోవిడ్ పేషెంట్లకు వైద్యం అందిస్తున్న వైద్యులతో పాటు సిబ్బందికి కూడా రోగుల పట్ల తీసుకోవలసిన బాధ్యతలు, చర్యలపై తగిన శిక్షణ ఇవ్వాలని తెలిపారు. 
    ఈ సమావేశంలో

జెమ్స్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామ్మోహన్, జనరల్ మెడిసిన్ హెచ్.ఓ.డి డా.సుధీర్, సూపరింటెండెంట్ ఇన్ ఛార్జ్ డా.కళ్యాణ్, డెప్యూటీ హౌస్ సర్జన్ డా. శ్రీనివాస్, రీజనల్ మెడికల్ ఆఫీసర్ డా.డి.ప్రవీణ్ కుమార్, జెమ్స్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam