DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అల్ప పీడన ప్రభావం,  వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాలు

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 14, 2020 (డిఎన్ఎస్):*

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావం కారణంగా వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. అందువల్ల కృష్ణానది పరివాహక ప్రాంతాల నుండి ప్రకాశం బ్యారేజి వద్దకు 60, 000 క్యూసెక్కుల వరద నీరు చేరుకునే అవకాశం ఉందని

జలవనరుల శాఖ కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు కృష్ణానది రివర్ కన్జర్వేటర్ రాజా స్వరూప్ కుమార్  ఒక ప్రకటనలో పేర్కొన్నారు.. ప్రస్తుతం 14.08.2020 ఉదయం 9.00 గంటలకు ప్రకాశం బ్యారేజీ నుండి 22, 000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నామని.. కృష్ణానది పరివాహక ప్రాంతల ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని,   లోతట్టు

ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అని ఆయన సూచించారు. కృష్ణానది మరియు కృష్ణా డెల్టా కాలువ ప్రాంతాల జలవనరుల శాఖ అధికారులు మరియు క్రిందిస్థాయి సిబ్బంది అందరు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.. ప్రమాదాల నివారణ కోసం కాలువ కట్టలు, వరద కరకట్టలు మరియు ఇతర నిర్మాణాలను తనిఖీ చేసి వెంటనే అవసరమైన

ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవల్సిందిగా అధికారులకు ఆయన సూచించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam