DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైఎస్సార్ నుంచి మరో భారీ వికెట్ ఔట్. . మనస్థాపంలో పీతల యాదవ్  

భూ దళారులతో పార్టీ పరువు పోయింది : పీతల 

మంత్రుల అక్రమాలు ప్రశ్నిస్తే షో కాజ్ నోటీసులా ? 

విశాఖపట్నం, జులై 13 , 2018 (DNS Online ): విశాఖ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ లో

ఫైర్ బ్రాండ్ à°—à°¾ పేరుపొందిన యువకుడు, అధికార ప్రతినిధి పీతల మూర్తి యాదవ్  à°ªà°¾à°°à±à°Ÿà±€à°•à°¿ శుక్రవారం రాత్రి రాజీనామా చేశారు. à°—à°¤ నాలుగేళ్ల కాలం నుంచి ప్రతిపక్ష పార్టీ

ప్రతినిధిగా పార్టీకి అండగా నిలబడి, ప్రతిష్టను విస్తరింపచేసిన పార్టీలో పెద్దలు పార్టీని కుక్కలు చింపిన విస్తరిగా తయారు చేస్తున్నారనే ఆవేదనతో పార్టీకి

రాజీనామా చేస్తున్నట్టు DNS కు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకై ఏర్పడిన పార్టీ కావడంతో చేరానని, అయితే పార్టీలో జిల్లా నేతలు చేస్తున్న చిల్లర పనులు

చూసి విసిగి పోయి, మిన్నకుండిపోయానని, భూ దండాలు చేసి ప్రజల్లో విశ్వాసం లేనివారి ని పార్టీ లోకి ఆహ్వానించినందున పార్టీ నుంచి బయటకు వెళ్తున్నట్టు తెలిపారు.

అధికార తెలుగుదేశం పార్టీలో ప్రజాప్రతినిధులు చేస్తున్న అక్రమాలు, అరాచకాలపై అలుపులేని పోరాటం చేసిన ఇతనికి పార్టీ పెద్దల నుంచి తగిన గౌరవం లభించకపోవడం తో

పాటు షో కాజ్ నోటీసులు కూడా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరం లో రౌడీ షీట్ ఉన్నవాళ్ళని, అరదండాలు పడిన వారికి పార్టీ పగ్గాలు అప్పగించడంతోనే పార్టీ పరువు

బజారున పడిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో  à°…ంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదల కుండా అధికార పార్టీతో పాటు, వాళ్లకి సహకరించిన జిల్లా అధికారుల

బండారాన్ని కూడా మీడియా ముఖంగా బయట పెట్టినట్టు తెలిపారు. దీంతో పార్టీ లో పెద్దలకి నచ్చలేదని, మంత్రులనే ప్రశ్నిస్తావా అని షో కాజ్ కూడా ఇచ్చారన్నారు. జిల్లాలో

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించలేదని, లులు సంస్థకు అప్పనంగా కట్టబెట్టిన భూములపై సర్వ్ చేసి పాలకుల బండారం బయట పెడితే ఈ సర్వ్ నగర

నేతల ఖాతాలో వేసుకున్నారని, ఆఖరికి జిల్లా జాయింట్ కలెక్టర్ అవినీతి కూడా బయటపెడితే, దాన్ని కూడా మాఫీ చేసేసిన ఘనులు విశాఖ వైఎస్సార్ పార్టీలో ఉన్నారన్నారు.

ప్రస్తుతం పార్టీ లోకి వచ్చిన వ్యక్తి పై మంత్రి కళా వెంకటరావు రౌడీ షీట్ తెరిపించిన మాట వాస్తవం కాదా అని అడిగారు, పైగా అతని పై భూ దందాలా కేసులు కూడా ఉన్నాయని,ఈ

నేపథ్యంలోనే కారాగారానికి కూడా వెళ్లిన మాట వాస్తవం కాదా అని అడిగారు, అలాంటి వ్యక్తికీ పార్లమెంట్ స్థాయి పదవి ఇవ్వడం ప్రజల్లోకి ఏవిధమైన సందేశాన్ని

ఇస్తుందన్నారు. 
పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారు అవసరం లేదని, కేవలం అర్ధ బలం ఉంటె చాలని, ఇదే విధంగా మరి కొంతమంది మనస్థాపం చెంది ఉన్నారని, వారు కూడా

త్వరలోనే పార్టీ నుంచి బయటకు రానున్నారన్నారు. 

పార్టీ ఆఫీసు నుంచి సామాను తరలించిన చిల్లర ప్రబుద్ధులు..

పార్టీ కార్యాలయం లో పదవి మారినప్పుడు పార్టీ

అధ్యక్షుని గా ఉన్న వ్యక్తి పార్టీ కార్యాలయం నుంచి సామాగ్రి ని ఇంటికి తరలించుకు పోయిన ఘనులు కూడా ఇక్కడే ఉన్నారని, దీనిపై అప్పటిలోనే రాద్ధాంతం

అయ్యిందన్నారు. పదవి మారితే మనిషి మాత్రమే బయటకు వెళ్ళాలి గానీ, మనిషి తో పాటు సామాను కూడా బయటకు తీసుకువెళ్లేంత చిల్లర వ్యవహారాలు కూడా చేసినవాళ్లు ఇక్కడ

నేతలుగా ఉన్నారని మూర్తి యాదవ్ ఎద్దేవా చేశారు. 

ఇంతకాలం తనకు అండగా నిలిచిన కార్యకర్తలకు, మీడియా సంస్థలకు ధన్యవాదములు తెలిపారు. తన తదుపరి కార్యాచరణ

త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇప్పడికే పార్టీ నగర అధ్యక్షులు మళ్ల విజయ ప్రసాద్ కు, తైనాల విజయ్ కుమార్ కు, ఇతర ప్రతినిధులకు మౌఖికంగా రాజీనామా విషయం చెప్పానని,

శనివారం అధికారికంగా లేఖ పంపుతున్నట్టు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam