DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ చికిత్స అందివ్వడంలో అలసత్వం వద్దు: సబ్ కలెక్టర్ సూరజ్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  ఆగస్టు 14, 2020 (డిఎన్ఎస్):*కరోనా బాధితులకు చికిత్స అందివ్వడంలో అలసత్వం వహించవద్దని  శ్రీకాకుళం జిల్లా టెక్కలి సబ్ కలెక్టర్ గనోర్ సూరజ్ ధనుంజయ అన్నారు. స్థానిక జిల్లా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన కోవిడ్ ఆసుపత్రిని శుక్రవారం ఆయన

ప్రారంభించారు. కోవిడ్ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చిన  నేపధ్యంలో పలు వార్డులలోని వైద్య, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపడంతోపాటు ఉత్తమ వైద్య సేవలను అందించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల లక్షణాలను నిశితంగా పరిశీలించి సరైన చికిత్స అందివ్వాలన్నారు.

కరోనా వైరస్  సోకిన వారు ఏఒక్కరూ మరణించకుండా చూడవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అలాగే సాధారణ విభాగంలో కూడా రోగులకు చికిత్స నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డా,లీలా సబ్ కలెక్టర్ కు వివరిస్తూ కోవిడ్ ఆసుపత్రిలో 45 పడకలు, 5ఐసియులతోపాటు అదనంగా 5 ఐసియులు, పూర్తిస్థాయిలో వైద్య

సదుపాయాలు కల్పించామన్నారు. 5గురు వైద్యులు, 4గురు స్టాఫ్ నర్సులు, పారిశుధ్య కార్మికులతో షిఫ్టుల ప్రకారం విధులు నిర్వహించనున్నారని తెలిపారు. కోవిడ్ బాధితుల కుటుంబ సభ్యులు సమాచారం తెలుసుకొనేందుకు గం.24లు అందుబాటులో ఉండేవిధంగా ఇద్దరు వైద్యులు, సిబ్బందితో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే హెల్ప్

డెస్క్ లను ఏర్పాటు చేసామన్నారు. 
       ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ కణితి కేశవరావు, వైద్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam