DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒకే పార్టీ నేతలకు. . తిరుపతిలో ప్రశంసలు . .సిక్కోలు లో విమర్శలు

*కోవిడ్ బాధితులకు ధైర్యం చెప్పేందుకు ఆసుపత్రిలోకి తిరుపతి నేత చెవిరెడ్డి*

*ముఖానికి మాస్కు లు  లేకుండానే ప్రజల్లోకి శ్రీకాకుళం లో నేతలు* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 15, 2020 (డిఎన్ఎస్):*  వీళ్ళందరూ రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలే. . .ఒకరు

తిరుపతి కి చెందిన వారు కాగా, ఇంకొకరు శ్రీకాకుళం జిల్లా నేతలు. వీళ్ళు ప్రజల్లోకి వెళ్లిన తీరుకు తిరుపతిలోని ఎమ్మెల్యే చెవిరెడ్డి కి సర్వత్రా అభినందనలు లభిస్తుండగా, శ్రీకాకుళం నేతలకు విమర్శలు ఎదురవుతున్నాయి. వివరాల్లోకి వెళితే. .. 

ప్రభుత్వ విప్, కోవిడ్ సమన్వయ కమిటీ కో చైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి

భాస్కర్ రెడ్డి తిరుపతి లోని స్విమ్స్ శ్రీ పద్మావతి స్టేట్ కోవిడ్ ఆసుపత్రి లో వైద్య సేవలు పొందుతున్న కరోనా పాజిటివ్ వచ్చిన వారిని నేరుగా వెళ్లి పరామర్శించడం అందరిని ఆశ్చర్యపరిచింది. 

* డాక్టర్లు సైతం పాజిటివ్ బాధితుల వద్దకు వెళ్లేందుకు సాహసించే క్రమంలో చెవిరెడ్డి పిపీఈ కిట్టు ధరించి బాధితుల వద్దకు

వెళ్లారు..

చికిత్స పొందుతున్న వారి లభిస్తున్న సదుపాయాలు, చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో వారు మరింత ఊరట పొందారు. చెవిరెడ్డి చేసిన ఈ పనికి సర్వత్రా అభినందనలు లభిస్తున్నాయి. 

* కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులను రక్షించుకోవడం నా వంతు బాధ్యతగా స్వీకరించాను.. ఆ కోవలో పనిచేస్తున్నాను అని

చెవిరెడ్డి చెప్పడం గమనార్హం. 

ఇదిలా ఉంటె. . . శ్రీకాకుళం లో ఇదే అధికార పార్టీ కి చెందిన మంత్రి, మరికొందరు అధికార పార్టీ నేతలు కనీసం ముఖానికి ఎటువంటి మాస్కు లేకుండానే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది. పైగా ఈ కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ నివాస్ సహా ప్రభుత్వ

అధికారులంతా ముఖానికి మాస్కులతో హాజరవ్వడం గమనార్హం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam