DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోటెత్తిన గోదారి వరద స్థితి పర్యవేక్షణలో ఎంపీ మార్గాని

*ధవళేశ్వరం వద్ద కొనసాగుతోన్న 2 వ ప్రమాద హెచ్చరిక*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 16, 2020 (డిఎన్ఎస్):* అఖండ గోదావరి వరద ఉధృతితో ఉరకలేస్తుంది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గల సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి వద్ద ఆదివారం సాయంత్రం 2 వ ప్రమాద హెచ్చరిక లో గోదావరి నది ప్రవాహ

ఉధృతి కొనసాగుతున్ క్రమంలో వరద పరిస్థితుల పై జల వనరుల శాఖ అధికారులతో ఎంపీ భరత్ రామ్ సమీక్షించారు. అఖండ గోదావరి ఎగువ ప్రాం నదీ పరీవాహ ప్రాంతాలలో చేపట్టిన అప్రమత్త చర్యలపై అధికారులతో సమీక్షించారు. లంక గ్రామాల ప్రజలను అవసరం మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గట్ల పటిష్టత, ఫ్లడ్

మెటీరియల్ స్టాక్ పాయింట్లు, అవసరమైన పక్షంలో సహాయక బోట్లు సిద్దంగా వుండాలని సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను ముందస్తుగానే అప్రమత్తంగా చెయ్యాలని ఆదేశించారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం వుందని అధికారులు తెలిపారు. గోదావరి ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో పరిస్తితి ని సమీక్షించి అనంతరం కాటన్ బ్యారేజ్ ని పరిశీలించారు. బ్యారేజ్

దిగువ ప్రాంతంలో పరిసర గ్రామాలు, ముంపు పరిస్తితి, పంటల పరిస్థితిపై వ్యవసాయ శాఖాధికా రులతో మాట్లాడారు. బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో స్థానికంగా భారీ వర్షాలు కురవడం, గోదావరి ఆవాసిత ప్రాంతాలలో వర్షాల వల్ల గోదావరి నది కి వరద పోటు ఉధృతంగా మారిన క్రమంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రస్తుతం తూర్పు

డెల్టాకు 2500 క్యూసెక్కుల నీరు, మధ్యమ డెల్టాకు 1000, పశ్చిమ డెల్టాకు 2000 కూసెక్కులు విడుదల చేస్తున్నామని జల వనరుల శాఖ అధికారులు ఎంపీ భరత్ రామ్ కు తెలిపారు. ప్రస్తుతం బ్యారేజ్ నుండి 14లక్షల 55 వేల 771 క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడిచిపె దుతున్నామని చెప్పారు. తక్షణ సహాయ, పునరావాస కేంద్రాల సేవలకు, బాధితులను సురక్షిత

ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అవసరం మేరకు సిద్దంగా వుండాలని గౌ ముఖ్య మంత్రి ఆదేశించార న్నారు. ఎంపీ భరత్ రామ్ వెంట జలవనరుల శాఖ ఎస్ఈ 
ప్రకాశ రావు, తదితరులు వున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam