DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వరద బాధితులకు సహాయం అందిస్తాం: మంత్రి చెల్లుబోయిన

*గంగవరం మండలం ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటన*  

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 16, 2020 (డిఎన్ఎస్):*

రాజమహేంద్రవరం, ఆగస్టు 16: గోదావరి వరద ఉధృతికి ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, బాధితులకు ప్రభుత్వం ద్వారా పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని బీసీ సంక్షేమ

శాఖామాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ భరోసా ఇచ్చారు. గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం కె.గంగవరం మండలంలో గోదావరి తీరం వెంబడి ఉన్న కొటిపల్లి, కూళ్ల, మసకపల్లి గ్రామాల్లో గోదావరి వరద ఉధృతిని మంత్రి చెల్లుబోయిన పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి ఉధృతికి

సంబంధించిన అంశాలతోపాటు,

బాధితులను ఆదుకునేందుకు తీసుకున్న చర్యలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోదావరి వరద ఉధృతి కారణంగా కోటిపల్లి-ముక్తేశ్వరం గ్రామాల మధ్య పంటు రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు వివరించారు. అలాగే కోటిపల్లి మతకార కాలనీలో సుమారు 50 గృహాలకు గోదావరి వరద తాకిడి ఉందని

తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ నీట మునిగిన గృహాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా అందుకు సంబంధించి పునరావాస కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గోదావరి వరద ఉధృతి ఎదుర్కొనే

విధంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గోదావరి వరద ఉధృతికి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, భారీగా కురిసిన వర్షాలకు ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యం కుదుటపడే విధంగా ప్రతీ ఒక్కరికీ అవసరమైన మందులను అందించేంద సహాయ, సహకారాలను అందిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో మంత్రి వెంట రామచంద్రాపురం రెవెన్యూ

డివిజనల్ అధికారి ఎం.గాంధీ, ద్రాక్షారామ మార్కెట్ యార్డ్ చైర్మన్ పండు గోవిందరాజు, తహసీల్దార్ కె. శశిధర్, వైద్యాధికారిణి డాక్టర్ పార్వతి, ఎస్ఎ బి. వినయ్ ప్రతాప్, మాజీ ఎంపీపీ మత్చా శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam