DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి పాలాసుపత్రిని కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చొద్దు 

*రాజమండ్రి కమిషనర్ కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని వినతి* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 16, 2020 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని తుమ్మలావలోని‌ చున్నీలాల్ జాజు ఫస్ట్ రిఫరల్ యూనిట్( పాలాసుపత్రిని)ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చ వద్దని రాజమహేంద్రవరం సిటీ

ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు ఆమె నగర పాలక సంస్థ కమిషనర్ అభిషిక్త్ కిషోర్ కు వినతి పత్రం అందజేసి మీడియాకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం నగరంలో విస్తృతంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ పట్ల ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తుమ్మలావలోని‌ చున్నీలాల్ జాజు ఫస్ట్ రిఫరల్

యూనిట్ ( పాలాసుపత్రి)ని కోవిడ్ ఆసుపత్రిగా మార్చడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. పాలాసుపత్రిగా అందరూ పిలుచుకునే ఫస్ట్ రిఫరల్ యూనిట్ ఆయా డివిజన్ల ప్రజలకు ఉపయుక్తంగా ఉందని, గర్బవతులు, బాలింతలు, శిశువుల ఆరోగ్య సంరక్షణకు సంజీవనిలా ఉన్న పాలాసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చడంపై వ్యతిరేకత

వస్తుందని తెలిపారు. చాలా మంది గర్భవతులు ఇక్కడే ప్రసవిస్తారని, దీంతో పాటు అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఆరు సంవత్సరాల వయసు వచ్చే వరకు వ్యాక్సిన్లు కూడా ఇక్కడే వేస్తారని అలాంటి పాలాసుపత్రిని ఇప్పడు కోవిడ్ సెంటర్‌గా మార్చేస్తే ప్రస్తుత భయంకర పరిస్థితులలో గర్భిణీలు వైద్య పరీక్షలకు గాని, ప్రసవాలకు గానీ ఎక్కడికి

వెళ్ళాలని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిని కూడా కోవిడ్ ఆసుపత్రిగా మార్చిన నేపధ్యంలో ప్రయివేట్ ఆసుపత్రిలో వైద్యం గానీ, వ్యాక్సిన్లు వేయించుకునే స్థోమత పేదలకు లేకుండా పోయిందని తెలిపారు.  ఈ విషయాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ను ఎమ్మెల్యే భవానీ కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam