DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హైదరాబాద్‌లో ₹ 100 కోట్ల మాదక ద్రవ్యాలు పట్టివేత

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 17, 2020 (డిఎన్ఎస్):* భాగ్యనగరంలో మరోసారి భారీఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. హైదరాబాద్‌ నగర శివారులో సుమారు రూ. 100 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేటు

బస్సులో హైదరాబాద్‌ నుంచి ముంబయికి తరలిస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. రూ.28.52 కోట్ల విలువైన 142.6 కిలోల మెఫెడ్రన్‌, రూ.3.1 కోట్ల విలువైన 31 కిలోల ఎపిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓ ఫ్యాక్టరీలో మెఫెడ్రిన్‌ తయారీకి సిద్ధంగా ఉంచిన 250 కిలోల ముడిసరకునూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ ముడిసరకు

విలువ రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. గత మూడు రోజులుగా హైదరాబాద్‌, ముంబయిలో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురిని అరెస్టు చేసిన అధికారులు.. రూ. 45లక్షల భారత కరెన్సీ, యూఎస్‌ డాలర్లు, ఈయూఆర్‌ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam