DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భాద్యతా రాహిత్యానికి మూడేళ్లు పూర్తి - ప్రచారం పిచ్చి లో భక్తులు బలి

గోదావరి పుష్కరాలలో దుర్ఘటనకు à°®à±‚డేళ్లు పూర్తి 

తప్పు అధికారగణానిది - శిక్ష సామాన్యులది 

రాజమండ్రి, జులై 14 , 2018 (DNS Online ): అధికార పార్టీ ప్రచారం పిచ్చికి

బలైన గోదావరి పుష్కరాల దుర్ఘటన జరిగి నేటికీ మూడేళ్లు కాలం గడిచింది. అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేసిన గోదావరి పుష్కరాలలో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు

రాజమహేంద్రవరానికి చేరుకున్నారు. ఇదే సమయంలో ప్రత్యేక విఐపి ఘాట్ లో స్నానం చెయ్యవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం వ్యామోహం లో భాగంగా సాధారణ

భక్తులు కోసం ఏర్పాటు చేసిన పుష్కరాల  à°˜à°¾à°Ÿà± లో తన సకుటుంబ సపరివార, అధికార, సినిమా షూటింగ్ సిబ్బంది సహా స్నానం చేసేందుకు వచ్చారు. అయితే పెద్దాయన స్నానం చేయడం,

పైగా లక్షలాది గా భక్తులు దీన్ని వీక్షించడాన్ని వీడియో చేటీకరణ చేయించారు. దీనికి సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను ప్రత్యక్ష పర్యవేక్షణ చెయ్యడం జరిగింది.

ముఖ్యమంత్రి వెళ్ళిపోగానే ఒక్కసారిగా గేట్లు తెరవడం తో అప్పడికే గంటల తరబడి వేచియున్న లక్షలాదిమంది భక్తులు నది స్నానానికి వెళ్లారు. అదుపుతప్పి బారికేడ్లు

విరిగిపోయి, సెక్యూరిటీ సిబ్బంది కంట్రోల్ చెయ్యలేని స్థితికి చేరిపోయి, సుమారు 29 మంది అసువులు బాయడం క్షణాల్లో జరిగిపోయింది. దీనికి భాద్యత వహించవలసిన

ముఖ్యమంత్రి, మంత్రివర్గం, ప్రజా ప్రతినిధులు భాద్యతారాహిత్యాన్ని అధికారగణం పై వేసేసారు. అనంతరం విడుదలైన నివేదికల్లో ఈ తప్పంతా ఒక్కసారిగా భక్తులు రావడం

వల్లే జరిగింది అని భక్తులపై నెట్టేసే ప్రయత్నాలు జరిగాయి.  à°®à±ƒà°¤à±à°² కుటుంబాలకు పరిహారం చెల్లించిన ప్రభుత్వం గాయపడినవారిని పూర్తిగా విస్మరించింది.

తొక్కిసలాటలో 51మంది గాయపడగా.. రెవెన్యూ అధికారులు ఆరుగురిని, పోలీసులు 51 మంది అని వేర్వేరుగా నివేదికలు ఇచ్చారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 50 వేల రూపాయల

పరిహారం ఆరుగురికి దక్కగా 45 మంది పరిహారం కోల్పోయారు.  
ఈ ఘటన పై ప్రభుత్వం వేసిన జస్టిస్ సోమయాజులు నాయకత్వాన వేసిన ఏకసభ్య కమిటీకి (సెప్టెంబర్ 15, 2015) ఇప్పటికే మూడు

సార్లు గడువు పొడిగించినా ఇప్పటికీ తన నివేదిక ఇవ్వలేదు.

గోదావరికి ఇదే తొలి పుష్కరాలన్నట్లు ప్రభుత్వం చేసిన ఆర్భాటానికి, చంద్రబాబు ప్రచార పిచ్చికి

అమాయకులు బలైపోయారు. బాధితులంతా సామాన్య నిరుపేద కుటుంబీకులే కాబట్టి, తప్పంతా గోదావరి తల్లిదే అని తీర్పు వచ్చినా ఆశ్చర్యపోనవసరంలేదు.

 

Picture : courtesy to whom soever it may concern 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam