DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉప్పొంగిన గోదావరికి మునిగి పోయిన గౌతమి ఘాట్ రహదారులు 

*కపిలేశ్వరపురం లో గోదావరి లో కొట్టుకుపోయిన మేకల మంద..*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 18, 2020 (డిఎన్ఎస్):* ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నా వరద తాకిడి కి గోదావరి నది లో నీరు ఉప్పొంగి పోతోంది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గౌతమి ఘాట్ వద్ద గల ఆలయాల రహదారులన్నీ

గోదావరి వరద నీతితో మునిగిపోయాయి. ఇస్కాన్ ఆలయం, శ్రీరంగధామమ్, తదితర ఆలయాలకు వెళ్లే దారులన్నీ వరద నీటిలోనే నిలిచిపోయాయి. గౌతమి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన మార్గం మొత్తం నీటిలోనే నిలిచిపోయింది. ఈ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లవద్దని, అధికారులు సూచిస్తున్నారు. 

కపిలేశ్వరపురం మండలం లోని అడ్డంకి గ్రామం సమీపం లోని

గోదావరి లో ఒక మేకల మంద  కొట్టుకుపోయింది. గోదావరి నీటి ఉధృతి అతివేగంగా ఉండడంతో వాటిని రక్షించేందుకు విఫల యత్నం చేసారు. 

కాగా, ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి వరద ఉధృతి మరింతగా పెరుగుతోంది. గేట్లను ఎత్తివేసి, నీటిని సముద్రం లోకి వదిలివేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam