DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కొవ్వూరు ముంపు గ్రామాల్లో మంత్రి తానేటి వనితా పర్యటన 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 18, 2020 (డిఎన్ఎస్):*  పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో గోదావరి  వరద ప్రవాహాన్ని కి గురైన మద్దూరు లంక గ్రామాన్ని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి  తానేటి వనిత పర్యటించారు. మద్దూరు లోని పునరావాస కేంద్రానికి వెళ్లి గ్రామ ప్రజలతో

మాట్లాడి వాళ్ళ ఇబ్బందులను అడిగి తెలుసుకుని, అధికారులందరిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.  నీట మునిగిన కుటుంబాలను పరామర్శించి ఎటువంటి  పరిస్థితులు ఏర్పడిన వాటిని ఎదుర్కోవడానికి మీకు అండగా వైయస్సార్ ప్రభుత్వం ఉందని భరోసా కల్పించారు. గత 30 సంవత్సరాలలో ఎన్నడు లేని విధంగా అఖండ గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో

మద్దూరు గ్రామం నీట మునిగిందని పేర్కొన్నారు.

ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మద్దూరు గ్రామ ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. గోదావరి ప్రవాహం వల్ల గ్రామంలోకి ప్రవేశించిన వరదనీటి వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొన్నారు. అధికారులందరూ అప్రమత్తంగా  ఉన్నారని

తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న  వరద బాధితులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వరద ప్రభావం లోనైనా మద్దూరు గ్రామ ప్రజలకు ప్రత్యేక రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.  ప్రస్తుతం భద్రాచలంలో గోదావరి ఉధృతి తగ్గిందని, కాబట్టి మద్దూరు ప్రాంతానికి ఎటువంటి ఇబ్బందులు లేవని ప్రజలకు

ధైర్యాన్ని కల్పించారు. ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు సంభవించినట్లు అయితే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అధికారులను సన్నద్ధం చేసినట్లుగా తెలిపారు.  అత్యవసర పరిస్థితుల్లో ఏర్పడినట్లయితే అచ్చట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి వీలుగా రెండు పడవలు కూడా ఏర్పాటు చేయడం జరిగినది.  వరద ప్రభావం ఏవిధంగా

ఉంటదో తెలియదు కాబట్టి ఎప్పటికప్పుడు అధికారులు ఇచ్చే సూచనలను తూచా తప్పకుండా పాటించాలని, వారికి  సహకరించి పునరావాస కేంద్రాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని మద్దూరు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 ప్రస్తుతం  కరోనా వైరస్ ప్రభావం తో ఇబ్బందులు పడుతున్న ప్రజలను రక్షించడం తో పాటు, వరదల వల్ల ఇబ్బందులు

పడుతున్న రాష్ట్ర ప్రజలను కూడా అన్ని విధాలుగా ఆదుకోవడానికి జగనన్న ప్రభుత్వం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుందని పేర్కొన్నారు.

అక్కడ నుంచి గోష్పాద క్షేత్రం సందర్శించి గోష్పాద క్షేత్రం నందు గోదావరి మాత శాంతింప వలసిందిగా, రాష్ట్రం సుభిక్షం అయ్యేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరుకుంటూ ప్రత్యేక పూజలు

నిర్వహించి, పసుకు కుంకుమను అర్పించి, భక్తిశ్రద్ధలతో హారతి ఇచ్చారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam