DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పుష్కరాల పాపం చంద్రబాబును వెంటాడుతుంది . . . . సోము వీర్రాజు

గోదావరి పుష్కరాలలో దుర్ఘటన పై నివేదిక వెంటనే ఇవ్వాలి : సోము వీర్రాజు 

విశాఖపట్నం, జులై 14 , 2018 (DNS Online ): మూడేళ్ళ క్రితం ఇదే రోజు ( జులై 14 ,2015)  గోదావరి పుష్కరాల్లో

రాజమండ్రి పుష్కరాల రేవులో జరిగిన దుర్ఘటనకు పూర్తి భాద్యుడు చంద్రబాబే నని భారతీయ జనతా పార్టీ ఎం ఎల్ సి సోము వీర్రాజు మండిపడ్డారు. అధికార పార్టీ ప్రచారం

పిచ్చికి  29 మందిని బలితీసుకున్న  à°¬à°²à±ˆà°¨ ఘటనకు పూర్తి భాద్యులు చంద్రబాబేనని, వి ఐ పీలకు ప్రత్యేక ఘాట్ ను సిద్దం చేసినా, కేవలం ప్రచారం మోజుతో అత్యంత రద్దీ à°—à°¾ ఉన్న

పుష్కరాల రేవులో  à°¸à°¿à°¨à±€ సెట్టింగ్ లను పెట్టుకుని మరీ జలకాలాడడం వల్లే à°ˆ ఘటన జరిగిందన్నారు. వీఐపీ లు à°Žà°‚à°¤ ఎక్కువ సేపు ఉంటె à°…à°‚à°¤ సేపు అధికారులకు ఇబ్బంది

పెడతానన్నారు. అలాంటిది ముందుగా అధికారులు హెచ్చరించినా పట్టుబట్టి ఇక్కడే స్నానం పేరిట ఎక్కువ సేపు జలకాలాడడం తో అనుకోని దుర్ఘటన జరిగి పోయిందన్నారు. దీని లో

మృత్యువాత పడిన వారికి సైతం తూతూ గా నష్ట పరిహారం ఇచ్చారని, ఇక గాయపడిన వారి గతి అదో గతే అయ్యిందన్నారు. ఈ ఘటన పై నియమించిన ఇక సభ్య విచారణ జస్టిస్ సోమయాజులు కమిటీ

నివేదిక ఇంకా ఇవ్వక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణం ఈ నివేదికను వెల్లడించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam