DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాత్రికేయుల కోసం ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి 

*రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని డిమాండ్* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 20, 2020 (డిఎన్ఎస్): కరోనా వైరస్ నేపధ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా తమ బాధ్యతలను నిర్వహిస్తున్న పాత్రికేయుల ఆరోగ్యాల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించాలని తూర్పు గోదావరి జిల్లా

రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ కోరారు. కడప జిల్లా పాత్రికేయుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని ఆ జిల్లా కలెక్టర్ వారి కోసం ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయని, ఆ మారిదిగానే మన జిల్లాలో కూడా పాత్రికేయుల కోసం ప్రత్యేక ఆసుపత్రిని కేటాయించాలని కోరారు. ఈ మేరకు ఆమె ఒక పత్రికా ప్రకటన

విడుదల చేశారు. మన జిల్లా పాత్రికేయుల కోసం ప్రధాన నగరాలైన కాకినాడ లేదా రాజమహేంద్రవరం నగరాల్లో ఎక్కడో ఒకచోట ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేసి కరోనా వైరస్ బారినపడి ఇబ్బందులు పడుతున్న పాత్రికేయులకు చికిత్స అందించాలని సూచించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పాత్రికేయులు

కరోనా బారినపడి సక్రమమైన వైద్యం అందక ఇప్పటికే చాలా మంది పాత్రికేయులు మృతి చెందారని, ఇకపై అటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. పాత్రికేయుల కోసం ప్రత్యేక ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా చాలా ఉందని పేర్కొన్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం

పని చేస్తున్న పాత్రికేయుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. కోవిడ్ ఆస్పత్రులలో వెంటనే సదుపాయాలను మెరుగు పరచాలని ఆమె సూచించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్ లకు సమాచార శాఖ ద్వారా పిపిఈ కిట్స్ అందజేయ్యాలని, కరోనాతో మృతి చెందిన జర్నలిస్ట్ ల కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఆర్థిక సహకారం

అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పాత్రికేయులకు వైద్య, ఆరోగ్య భద్రత కల్పించాలని, కరోనా బారినపడి చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు ఆర్థికసాయం అందించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam