DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సెప్టెంబర్ 10 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 21, 2020 (డిఎన్ఎస్):* వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు సెప్టెంబర్ల 10 నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల తేదీలపై ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఒకరోజు లోకసభ సమావేశాలు, మరో రోజు రాజ్యసభ సమావేశాలు.. ఇలా జరుగుతాయని

సమాచారం. ఇలా నాలుగు వారాల పాటు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. లోకసభ సభ్యులందరూ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సమావేశమవుతారని, రాజ్యసభ సభ్యులు మాత్రం లోకసభ, రాజ్య సభలో కూర్చోనున్నారు. ఎంపీలందరూ తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని నిబంధన విధించారు. స్క్రీనింగ్ నిర్వహణతో పాటు శానిటైజింగ్ వ్యవస్థ

ప్రతి చోటా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఆయా సభ్యుల వ్యక్తిగత సిబ్బందికి మాత్రం పార్లమెంట్‌లోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam