DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అధికారులంతా అప్రమత్తంగా ఉండండి: మంత్రి చెల్లుబోయిన 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 21, 2020 (డిఎన్ఎస్):* వరదలు, కొవిడ్‌ 19, వినాయక చవితి ఉత్సవం నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని బీసీ సంక్షేమ శాఖామాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ ఆదేశించారు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం వరదలు,

కరోన, వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించిన అంశాలపై జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌ రెడ్డితో కలిసి బీసీ సంక్షేమ శాఖామాత్యులు చెల్లుబోయిన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులకు సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి, నగర పాలక సంస్థ కమిషనర్‌ ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ ప్రస్తుతం రాజమహేంద్రవరం నగరంలో కొవిడ్‌`19 కేసులు,

తీసుకుంటున్న చర్యలతోపాటు, గోదావరి వరదలకు సంబంధించి లంకల్లో ఉన్న ప్రజలను పునరావస కేంద్రాలకు తరలింపు, వారికి కల్పించిన సౌకర్యాలు, అలాగే నగరంలో ముంపు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా తీసుకుంటున్న చర్యలను వివరించారు. కరోన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వినాయక చవితిని పురష్కరించుకుని బహిరంగ

ప్రదేశాల్లో మండపాల ఏర్పాటును నిలుపుదల చేయడం జరిగిందని వివరించారు. ఎవ్వరి ఇంటిలో వారు గణేషుని ఉత్సవాలను నిర్వహించాలని ఇప్పటికే నగర ప్రజలకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ కరోన నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

రాజమహేంద్రవరం నగరంలో కరోన నివారణకు ప్రజలను మరింతగా అప్రమత్తం చేయాలని సూచించారు. గోదావరి ఉధృతి పెరుగుతున్నందున ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిర్వహించుకునేలా ప్రజలు అధికారయంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో

అడిషనల్‌ ఎస్‌పి లతా మాధురి, స్పెషల్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అడిషనల్‌ ఎస్‌పి రమాదేవి పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam