DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మట్టి వినాయక విగ్రహాలనే పూజించండి : ఎంపీ ఎంవివి

*విజెఎఫ్ ఆధ్వర్యవంలో వినాయక విగ్రహ, మొక్కలు పంపిణీ* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 21, 2020 (డిఎన్ఎస్):* జర్నలిస్టులు సమాజభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారని, వారితోనే సమాజ ప్రగతి సాధ్యమని విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అన్నారు . శుక్రవారం విజెఎఫ్ క్లబ్ లో

వైజాగ్ జర్నలిస్టుల ఫోరమ్ ఏర్పాటు చేసిన వేదిక నుంచి మట్టివినాయక విగ్రహాలు, వృతకల్ప పుస్తకాలు, మొక్కల పంపిణీ చేపట్టారు. జర్నలిస్టుల సంక్షేమానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం లో జివియంసి  ప్రధానావైద్యాధికారి డాక్టర్ శాస్త్రి మాట్లాడుతూ వినాయక చవితిని పురస్కరించుకొని ప్రతిఒక్కరూ మట్టి

వినాయక విగ్రహాలనే పూజించాలని , ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అందరూ ఇళ్లలోనే పూజలు నిర్వహించుకోవాలని కోరారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైజాగ్ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ తమ సభ్యుల సంక్షేమమే ప్రధాన లక్ష్యమన్నారు . వినాయక చవితి పర్వదినంతో పాటు అన్ని పండుగలు

జర్నలిస్టులు జరుపుకోవడం సంతోషదాయకమన్నారు . కరోనా మార్గదర్శకాల ప్రకారం జర్నలిస్టులందరికీ స్వాతి ప్రమోటర్ల్ సౌజన్యంతో విగ్రహాలు , వృతకల్పాలు పంపిణీ చేశామన్నారు . దీనితో పాటు మొక్కలు కూడా అందజేయడం జరిగిందన్నారు . వి.జె.ఎఫ్ . కార్యదర్శి ఎస్ . దుర్గారావు మాట్లాడుతూ అందరి సహకారంతోనే ఆయా కార్యక్రమాలు విజయవంతంగా

చేయగలుగుతున్నామన్నారు . జర్నలిస్టుల సంక్షేమంతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తుమన్నారు . భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు . స్వాతి ప్రమోటర్స్ అధినేత మేడపాటి కిృష్ణారెడ్డి,  ఎ.పి. డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వి.వి. మహేశ్వరరెడ్డి తదితరులు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు .

కార్యక్రమం లో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు ఆర్ . నాగరాజు పట్నాయక్, దాడి రవికుమార్ , ఇరోతి ఈశ్వరరావు , దొండా గిరిబాబు ,ఎమ్మెస్సార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు .

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam