DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వరద బాధితులకు అండగా ప్రభుత్వం: మంత్రి భరోసా

*ఏరియా ఆసుపత్రిలో వెంటలేటర్స్ ప్రారంభం*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 22, 2020 (డిఎన్ఎస్):* వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ఎటువంటి ఆందోళన చెందవద్దని బీసీ సంక్షేమ శాఖామాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అభయం ఇచ్చారు. తూర్పు గోదావరి

జిల్లా  
 రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలంలోని గోదావరి వరద వల్ల ముంపునకు గురియైన కోటిపల్లి, బోదిలంక గ్రామాల్లో శనివారం జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గోదావరి వరద ముంపులో ఉన్న బాధితులను కలిసేందుకు నాటు పడవపై వెళ్లి వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం తరుపున అందిస్తున్న సహాయ సహకారాలపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. అధికార యంత్రాంగం అందిస్తున్న భోజనం, మంచినీరు, ఇతర సౌకర్యాలు అందిస్తున్న తీరుపట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ రాబోయే కాలంలోనూ గోదావరి వరద ఉధృతి పెరిగే అవకాశాలు

ఉన్నాయని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.ఐదు వేలు చొప్పున అందించడం జరిగిందన్నారు. అలాగే ఇతర సౌకార్యాలను కల్పించేందుకు వీలుగా జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. వరదల సమయం వచ్చిన నాటి నుంచి జిల్లా కలెక్టర్ పండగను సైతం పక్కన పెట్టి ఎటువంటి విశ్రాంతి తీసుకోకుండా ప్రజలకు

అందుబాటులో ఉంటున్నారని అన్నారు. ఇప్పటికే దేవీపట్నం మండలంలో ముంపు గ్రామాలను పర్యటించామని, కె.గంగవరం మండలం లోని  లంక గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ఏఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకుని ప్రతినిత్యం ప్రణాళికాబద్ధంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. రాష్ట్ర

ప్రభుత్వం మీ కష్టాలను తీర్చిందుకు సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బాధల్లో ఉన్న ప్రజలకు వలంటీర్ కోడి దుర్గాప్రసాద్ నిన్నటి రోజున పీకలోతులో వెళ్లి బాధితులకు భోజనం అందించారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్

రెడ్డి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించారని, వలంటీర్ కోడి దుర్గాప్రసాద్ ను ఆదర్శంగా తీసుకుని వలంటీర్లు అంతా ప్రజలకు సేవలు అందించాలని పిలుపునిచ్చారు.

ఏరియా ఆసుపత్రిలో వెంటలేటర్స్ ప్రారంభం

కొవిడ్ -19 వ్యాధిగ్రస్తుల కోసం రామచంద్రపురం ఏరియా ఆసుషత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంటిలేటర్లను

మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ జిల్లా కలెక్టర్ తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ఒకపక్క వరదలు, మరోపక్క కొవిడ్ వైరస్ తో రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తుందన్నారు. ఈ రెండు ఉపద్రవాలను ఏకకాలంలో ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు,

జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తుందన్నారు. కొవిడ్ నివారణ చర్యల్లో భాగంగా ఏరియా ఆసుషత్రుల్లోనూ కరోన బాధితులకు అవసరమైన వెంటిలేటర్లను ఏర్పాటు చేయడం జిల్లాలోనే ప్రథమం అని అన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని అన్నారు. ఈ పర్యటనలో రామచంద్రపురం

 ఆర్‌డిఒ ఎం.గాంధీ, ట్రైనీ డి ఏస్ పి బాలచంద్రారెడ్డి, ఏరియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రవీణ్, ద్రాక్షారామ మార్కెట్ యార్డు కమిటీ ఛైర్మన్ పండు గోవిందరాజులు, ఎఈ సుబ్బారావు, డిప్యూటీ తహసీల్దార్ పి.శశిధర్, విఆర్ఓ సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam