DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద ఘంటిక

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 22, 2020 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా  రాజమహేంద్రవరం సమీపం లో గోదావరి వరద నిలకడగా సాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరికతో గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 18.60 అడుగుల

నీటిమట్టం నమోదు అయ్యింది. దీంతో గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని వచ్చింది వచ్చినట్లుగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో బ్యారేజీ నుంచి 20 లక్షల 38 వేల 071 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అలాగే డెల్టా కాలువలకు 9,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే భద్రాచలం వద్ద

గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు భద్రాచలం వద్ద 52.60 అడుగుల నీటిమట్టం నమోదు అయ్యింది. వరద ఉధృతి మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

రాజమహేంద్రవరం, ఆగస్టు 22: రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ పరిధిలో గడిచిన 24 గంటల్లో కురిసిన

వర్షపాతం వివరాలు. సీతానగరం మండలంలో 7.2 మిల్లీమీటర్లు, గోకవరం మండలంలో 8.2 మిల్లీమీటర్లు, కోరుకొండ మండలంలో 8.4 మిల్లీమీటర్లు, రాజమహేంద్రవరం అర్బన్ మండలంలో 1.2 మిల్లీ మీటర్లు, రాజమహేంద్రవరం రూరల్ మండలంలో 0.0 మిల్లీ మీటర్లు, రాజానగరం మండలంలో 3.0 మిల్లీమీటర్లు, కడియం మండలంలో 0.0 మిల్లీ మీటర్లు, అలమూరు మండలంలో 1.2 మిల్లీ మీటర్ల

వర్షపాతం నమోదు అయ్యింది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam