DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోన బాధితులను ఆదుకునేందుకు విజేతలు సహకరించాలి 

*వైద్య శాఖా అధికారులకు సబ్ కలెక్టర్ అనుపమ సమీక్ష* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 24, 2020 (డిఎన్ఎస్):* కరోన బాధితులను ఆదుకునేందుకు కరోన నుంచి బయటపడిన వారు సహకరించాలని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం డివిజన్ సబ్ కలెక్టర్ అనుపమ అంజలి పిలుపునిచ్చారు. స్థానిక సబ్

కలెక్టర్ కార్యాలయం లో సోమవారం సాయంత్రం వైద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్లో  మండలాల్లో కరోన కేసులకు సంబంధించి వైద్య శాఖ అధికారులు వివరించారు. రూరల్ మండలాల్లో 3049 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. వీటిలో 1585 కేసులు రికవరీ అయ్యాయని, 1464 కేసులు యాక్టివ్ లో ఉన్నాయని

తెలిపారు. 1016 మంది హౌస్ అసోలేషన్ లో ఉన్నారని చెప్పారు. అలాగే కొత్తగా సోమవారం 97 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రాజమహేంద్రవరం అర్బన్ లో 4,206 కేసులు నమోదయ్యాయని, 2,693 కేసులు రికవరీ కాగా, 1383 కేసులు యాక్టివ్ లో ఉన్నాయని చెప్పారు. కొత్తగా సోమవారం 120 పాజిటివ్ కేసులు వచ్చాయన్నారు. ఇప్పటికే కరోన నుంచి బయట పడిన వారి ఆరోగ్య పరిస్థితి పై

ప్రతీరోజు జూమ్ యాప్ ద్వారా తెలుసుకుంటున్నట్లు వివరించారు. కరోన నుంచి బయట పడిన వారి యొక్క రక్తాన్ని డోనేట్ చేయాలని కోరుతున్నామని, ఇప్పటి వరకు 350 నుంచి 450 మందిని కోరడం జరిగిందని, వీరిలో 147 మంది రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. రక్తాన్ని దానం చేసే వారికి ప్రభుత్వం ఇస్తున్న రూ.5 వేలు ప్రోత్సాహం ను

వివరిస్తున్నట్లు తెలిపారు. ఆలమూరులో 11 మంది, రాజానగరం నుంచి 18 మంది, రాజమహేంద్రవరం రూరల్ మండలం నుంచి 83 మంది, గోకవరం నుంచి ఇద్దరు, కడియం నుంచి ఎనిమిది మంది, సీతానగరం నుంచి 14 మంది, రాజమహేంద్రవరం అర్బన్ నుంచి 11 మంది రక్త దానం చేసేందుకు ముందుకు వచ్చారని వివరించారు. ఈ సందర్భంగా బొమ్మూరులోని కోవిడ్ కేర్ సెంటర్లో అందిస్తున్న

సదుపాయాలు, ఆహారం, ఇతర అంశాలపై సబ్ కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అనుపమ అంజలి మాట్లాడుతూ కరోన బాధితుల యోగ క్షేమాన్ని ప్రతిరోజూ తెలుసు కోవాలని సూచించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని, ఈ కంట్రోల్ రూమ్ నెంబర్ 0883-2424267 కు ఏమైనా సమస్యలు ఉంటే తెలియ చేయాలని బాధితులకు సూచించారు. హోం

ఐసోలేషన్ లో ఉన్న వారికి అవసరమైన మెడికల్ కిట్లను అందించటంలో నిర్లక్ష్యం వద్దని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు డి ఎం అండ్ హెచ్ ఓ కోమల, ఎం హెచ్ ఓ వినూత్న, కె ఆర్ ఆర్ సి తహసీల్దార్ శ్రీనివాసరావు, సి సి సి ఇంచార్జి అశోక్, వైద్యులు జ్యోతి, సునీత, కంట్రోల్ రూమ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam