DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లక్షల కోట్ల నిధులు కేంద్రానివి - పేరు చంద్రబాబుదా ?. . సోము వీర్రాజు మండిపాటు

పోలవరం పై పూర్తి భాద్యత, హక్కు కేంద్రానివే 
 

విశాఖపట్నం, జులై 14 , 2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే ప్రతి ప్రాజక్టు పూర్తి చెయ్యడం లోనూ భారతీయ జనతా

పార్టీకి చిత్తశుద్ధి ఉందని, అయితే కేంద్రం నిధులు వాడుకునే చంద్రబాబు, కనీసం ప్రధాని మోడీ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము

వీర్రాజు మండిపడ్డారు. శనివారం విశాఖపట్నం లోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కి లక్షల

కోట్ల రూపాయల నిధులు కేంద్రం ఇస్తోంటే వాటి కి పేర్లు చంద్రబాబు హక్కుల పెట్టుకుని తన నీచ సంస్కారాన్ని బయట పెట్టుకుంటున్నాడన్నారు. పోర్ట్ ట్రస్ట్ లు కేంద్రం

పరిధిలో ఉంటాయని, నిన్న విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో జరిగిన కార్యక్రమానికి ఏర్పాటు చేసిన బ్యానర్లలో చంద్రబాబు ఫోటో తో పాటు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫోటో

మాత్రమే ముద్రించారని, వీటికి నిధులు ఇచ్చిన మోడీ ఫోటో ఎక్కడ వెయ్యక పోవడం పూర్తి à°—à°¾ భాద్యత పోర్టు చైర్మన్, రాష్ట్ర ముఖ్యమంత్రిదే నన్నారు.  à°¦à±€à°¨à°¿à°ªà±ˆ బీజేపీ

కార్యకర్తలు మోడీ మోడీ అని నినాదాలు చెయ్యగా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అభివృద్ధి పనులు కదా, ఫోటో పై కొంత సంయమనం పాటించమని సర్ది చెప్పారన్నారు. 
కేంద్రం

జాతీయ ప్రోజక్ట్ గా ప్రకటించిన పోలవరం పై పూర్తి హక్కు, భాద్యత కేంద్ర ప్రభుత్వానిదే నన్నారు. సకాలంలోనే దీన్ని పూర్తి చేసి బీజేపీ చిత్తశుద్ధి

ప్రకటిస్తుందన్నారు. ఈ ప్రోజక్ట్ ను పర్యవేక్షిస్తాం అని కేంద్రాన్ని చంద్రబాబు బ్రతిమాలుకుంటే అనుమతి ఇచ్చిందని, దీనిలో తన సొంత పార్టీ వాళ్లకి, అనుచరులకు

లబ్ది చేకూరేలా అక్రమాలు చేసి పూర్తిగా బ్రష్టు పెట్టించాడని తెలిపారు. పోలవరం పై స్పష్టత వచ్చేవరకు పదవి ప్రమాణ చెయ్యవద్దని, తాము చంద్రబాబు ను కోరామని, ఆలా

చేపడితే, కేసీఆర్ ఈ ప్రాజక్ట్ ను చెయ్యనివ్వదని కూడా హెచ్చరించిన వినకుండా తన స్వార్ధం కోసం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేశాడన్నారు. కేంద్రం పై

ఒత్తిడి టీయూకువచ్చి ముంపు మండలాలని ఆంధ్రాలో కలిపించిన ఘనత ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ దేనని, పోలవరం కు సంబంధించి చంద్రబాబు చెప్పుకునేందుకు ఏమీ లేక మోడీ పై పడి

నోరు పారేసుకుంటున్నదన్నారు. కోట్లు ఖర్చు  à°šà±‡à°¸à°¿ నిరసన సభ అంటూ మోడీ తిట్టడానికే సమయాన్ని వృధా చేస్తున్నదన్నారు. చంద్రబాబు అండ్ కో చేసేవన్నీ దొంగ దీక్షలు,

ముసలి కనీళ్ళే నని రానున్న ఎన్నికల్లో ప్రజలు బాబు కు చుక్కలు చూపించడం ఖాయమన్నారు. 
ఈ విలేకరుల సమావేశం లో ఉత్తరాంధ్ర జిల్లాల ఎం ఎల్ సి పివిఎన్ మాధవ్,

విశాఖపట్నం నగర బీజేపీ అధ్యక్షులు à°Žà°‚. నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam