DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాఠశాలలు తెరవడం రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత చర్య

*ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జగదీశ్*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 26, 2020 (డిఎన్ఎస్):* కరోనా ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న సందర్భంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం హాస్యాస్పదం అని, జాతీయ కార్యవర్గ సభ్యులు జగదీష్

అభిప్రాయపడ్డారు. విశాఖ లోని సంస్థ కార్యాలయం లో జరిగిన సమావేశంలో అయన మాట్లాడుతూ స్వయంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రినే కరోనా కారణంగా బాధ పడడం విచారకరమన్నారు. 

సెప్టెంబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను ప్రారంభించడం సరైన చర్య కాదు అని వెంటనే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సూచించారు.

ఇప్పటికిప్పుడు ఈ విధమైన ఆలోచనలు సరైనవి కావని విద్యార్థుల జీవితాలను అగాధంలోకి నెట్టి వేయడమే అని అన్నారు. జగనన్న విద్య కానుక పేరుతో విద్యార్థులకు పుస్తకాలు బట్టలు షూస్ ఇవ్వడాన్ని ఏబీవీపీ స్వాగతిస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వ  ప్రచార ఆర్భాటాలకు, నాయకుల వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి విద్యార్థుల ప్రాణాలతో

చలగాటం ఆడే ప్రయత్నిస్తే ఏబీవీపీ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది అని అన్నారు. 
ఈ అంశంపై వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా జరిపిన సర్వేలో 82 శాతం మంది తల్లిదండ్రులు పాఠశాలల ప్రారంభ ప్రక్రియను వ్యతిరేకించారని తెలిపారు.ఉన్నత విద్య డిగ్రీ పీజీ విశ్వవిద్యాలయలు ప్రారంభించకుండా, పాఠశాలలు తెరవడం లోని ఆంతర్యం ఏమిటో విద్యాశాఖ

మంత్రికే  తెలియాలని ఎద్దేవా చేశారు.విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్టీ ప్రభుత్వ పథకాల ప్రచారం  సరికాదని గ్రహించాలి అని హితవు పలికారు. గ్రామస్థాయిలో నాడు నేడు, జగనన్న విద్యా కానుక పథకాల ప్రచారం వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రపంచంలోని పలు దేశాలలో ఇలానే అనాలోచిత నిర్ణయాలు అనుభవాలు గ్రహించాలన్నారు.

ప్రారంభించిన పది రోజుల్లోనే లక్షల కేసులు నమోదయ్యాయని అన్నారు.ఆన్లైన్ ఫీజు దందాను అరికట్టడం లో శ్రద్ధ శక్తులు లేని రాష్ట్ర ప్రభుత్వానికి పాఠశాలల ప్రారంభానికి ఎందుకు అంత ఆరాటం అని ప్రశ్నించారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీ ప్రత్యక్షంగా చేసుకోవడానికి మార్గం సుగమం చేశారని అన్నారు.ప్రైవేట్

వాళ్ళ ఫీజుల దందా ప్రభుత్వ పథకాల ప్రచారం రెండు కలిసి వస్తాయని పెట్టార అని ప్రశ్నించారు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి ప్రస్తుత పరిస్థితిని తట్టుకోలేని పసిపిల్లలపై ప్రభుత్వ ప్రయోగం విరమించుకోవాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఉభయ రాష్ట్రాల గిరిజన విద్యార్థుల

కన్వీనర్ కృష్ణ, ఆంధ్ర యూనివర్సిటీ ఇంచార్జ్ లీలా శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేంద్ర, లలిత్ మాధవ్ పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam