DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమహేంద్రి ట్రాఫిక్ రద్దీకి  ఫ్లై ఓవర్ తో చెక్. . .

*రూ.135 కోట్ల ఖర్చుపై సాయం  అందించండి*

*సాయం కోసం రైల్వే బోర్డు చైర్మన్ రమేష్ కు ఎంపీ భరత్ లేఖ*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 27, 2020 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లాకు ఉన్న రెండు కళ్లలో ఒక కన్నుగా ఉన్న రాజమహేంద్రవరం నగరం ట్రాఫిక్ కోణంలో సిద్ధమవుతోంది. చారిత్రక

ప్రదేశంగా ఆర్జించిన  కీర్తితో పాటు హోల్ సేల్ వాణిజ్య, వ్యాపారాల సముదాయాలు ఈ నగరం సొంతం కావడంతో సూర్యోదయం మొదలు రాత్రి పదిగంటల వేళ వరకూ  జనం బిజీగా పోటెత్తుతారు.  దీనికితోడు 5.50 లక్షల నగర జనాభాతో కిటకిలాడుతూ అధికంగా ఉండే చిన్నచిన్న రహదారులతో కాలూనలేనిస్ధితిలో వాహనాల గడబిడ ఠారెత్తిస్తున్నవేళ ఈ నగరం ఆర్.ఒ.బి తో

కూడిన ఫ్లై ఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది... ఇందుకు రైల్వే , నగర మున్సిపల్ కార్పొరేషన్ విభాగాల సంయుక్త సహకారంతో పశ్చిమగోదావరి నుంచి  నగరం మీదుగా ప్రవేశించే వాహనాలు బ్రిడ్జి దిగాక నగరంతో అవసరం లేకుంటే నేరుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేలా ఎన్ .హెచ్ 16 పై ఉన్న హుకుంపేట వద్ద కలిసేవిధంగా ఫ్లై ఓవర్ నిర్మాణానికి

ప్రయత్నాలు మొదలయ్యాయి.ఇందుకు సంబంధించి రాజమహేంద్రి పార్లమెంట్ సభ్యులు, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ బ్లూ ప్రింట్ తో సహా రైల్వేబోర్డ్ చైర్మన్ రమేష్ కుమార్ యాదవ్ ను  ప్రత్యేక లేఖతో కల్సి వివరించారు...నగరానికి అత్యంత కీలకమైన ప్రజా సమస్యగా మారిన ట్రాఫిక్ అంశం ఉన్నత స్ధాయికి తేవడంలో ఎంపీ

చొరవ అభినందనీయంగా పలువురు పేర్కొంటున్నారు...ఇప్పటికే కార్పొరేషన్ కూడా ఇందుకు సంబంధించి ఆమోదించిన మాస్టర్ ప్లాన్ లో రెండు జిల్లాలను కలిపే రోడ్ కమ్ రైలు బ్రిడ్జి నుండి నేరుగా ధార్వాడవారివీధి, వి.టి.కళాశాల వైపు రైల్వేక్రాసింగ్ దాటి ఎ.డబ్ల్యు.ఎ(మార్షీ భూమి) మీదుగా హుకుంపేట జాతీయ రహదారికి రోడ్డు నిర్మాణ పనులు

చేపట్టిందని లేఖలో పేర్కొన్నారు... ఇందుకు సంబంధించి కార్పొరేషన్ యాజమాన్యం ఎన్.హెచ్.16 పాయింటు నుంచి రోడ్ కం రైలు బ్రిడ్జి వైపునకు రహదారి నిర్మాణం చేపట్టిందన్నారు... మధ్యలో ఆర్.ఓ.బి నిర్మాణంతో పాటు ట్రాక్ ఏరియా భూముల సేకరణ సైతం అవసరమౌతుందన్నారు... ఆర్ధిక లోటుపాట్ల కారణంగా మునిసిపల్, ఆర్&బి విభాగాలు మూడుదశాబ్దాలుగా

ఉన్నప్రజాసమస్యకు కుస్తీ పడుతున్నా ఓ కొలిక్కి రాలేదని లేఖలో గుర్తు చేశారు...దాదాపు రూ.135 కోట్లు ఖర్చయ్యే ఆర్ఓబీ...ఎఫ్ఓబీ ల నిర్మాణానికి కేంద్రం మరియు రైల్వే మంత్రిత్వ శాఖలు చొరవతీసుకుని నిర్మాణం చేపట్టాలని చైర్మన్ కు అందించిన లేఖలో ఎంపీ భరత్ రామ్ విజ్ఞప్తి చేశారు...లేఖతో పాటు కార్పొరేషన్ మార్క్ చేసిన మాస్టర్ ప్లాన్

కాపీని జతచేసి నిధుల మంజూరుకు చొరవ తీసుకోవాలని భరత్ రామ్ కోరారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam