DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డా. పురుషోత్తం కుటుంబానికి మంత్రి ముత్తంశెట్టి పరామర్శ 

డాక్టర్ కుటుంబానికి రూ. 50 లక్షలు ప్రభుత్వం సహాయం

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 27, 2020 (డిఎన్ఎస్):* విశాఖపట్నం కె జి హెచ్ లో కరోనా బాధితులకు చికిత్స చేస్తూ బుధవారం మరణించిన డాక్టర్ పురుషోత్తం కుటుంబ సభ్యులను  పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు,

ఏఎంసి ప్రిన్సిపాల్,  కేజీహెచ్ సుపరెండెంట్  డాక్టర్ సుధాకర్ పరామర్శించారు. డాక్టర్ పురుషోత్తం మృతి చాలా బాధాకరమని, ఆయన సమాజానికి ఎంతో సేవచేశారన్నారు. కరోనా వారియర్ గా సేవలందిస్తూ మృతి చెందడం అందరినీ కలచివేసిందన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. కోవిధ్ సమయంలో వైద్యులు దేవుళ్ళుతో

సమానమని, కరోనా సేవలు అందిస్తున్న వైద్యులకు ఎంత సహాయం చేసిన తక్కువే నన్నారు.

డాక్టర్ పురుషోత్తం కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ. 50 లక్షలు సహాయం అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి తెలిపారు. కోవిడ్ సేవలు అందిస్తున్న వైద్యులకు పూర్తి స్థాయిలో భద్రత భరోసా ఇవ్వాలని సీఎం ఆదేశించారని ఆ మేరకు

పురుషోత్తం కుటుంబానికి రూ.50 లక్షల సహాయాన్ని కూడా అందిస్తారని మంత్రి వెల్లడించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam