DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం బోర్డు మీటింగ్ పెట్టింది భూ లీజుల కోసమేనా?

*చైర్మన్ సంచయిత గైర్హాజరు, వీడియో లో తూతూ మంత్రంగా భేటీ*

*ఓఎస్ డి నియామకం మాత్రం ఒకే మిగిలిన 11 అంశాలూ ఇంటికే. .* 

*గోశాలలో మీడియా పై ఆలయ ఈఓ భ్రమరాంబ అసహనం. .*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 27, 2020 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్యదైవమైన శ్రీ

వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం, సింహాచలం ట్రస్ట్ బోర్డు సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. దాదాపు 15 ఏళ్ళు తర్వాత జరిగిన తోలి సమావేశం కావడం తో భక్తులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సమావేశానికి చైర్ పర్సన్ సంచయిత రాకపోవడంతో పాటు, వీడియో ద్వారా తూతూమంత్రంగా పాల్గొనడం గమనార్హం. పైగా దేవస్థానానికి ఉన్న

కోట్ల విలువ చేసే భూములను అధికార పార్టీ నేతలకు 11 ఏళ్లపాటు లీజుకు ఇవ్వడం కోసమే ఈ సమావేశం పెట్టినట్టుగా తెలిసింది. 

ఇంటర్నెట్ సదుపాయం సరిగ్గా లేకపోవడంతో సంచయిత చేయవలసిన ప్రసంగం చాలాసార్లు అంతరాయం కల్గింది.
అడవివరం ( కృష్ణాపురం ) లోని ఆలయ దేవస్థానం  గోశాలలో గల ఆయుర్వేద వైద్య సమావేశ మందిరం లో జరిగిన సర్వ

సభ్య సమావేశానికి కొందరు బోర్డు సభ్యులు తమ కుటుంబ సభ్యులతో సహా హాజరు కావడం కనిపించింది.

ఈ క్రమం లోనే కవరేజి కోసం వెళ్లిన మీడియా వర్గాలపై ఆలయ ఈఓ భ్రమరాంబ కాస్తంత అసహనాన్ని ప్రకటించడం టీవీల్లో సైతం కనిపించింది.  జరిగేది ఏక ఎజండా సమావేశమైనప్పడికీ మీడియా వర్గాల ఒత్తిడి తట్టుకోలేక, కేవలం ఫోటో లు, వీడియో

మాత్రం తీసుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. 

ప్రధానంగా ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన వంశ పారంపర్య (అనువంశిక ) ధర్మకర్త సంచయిత గజపతి కేవలం వీడియో ద్వారా పాల్గొనడం పై కొంత విమర్శలు తలెత్తాయి. 

సభ్యుల్లో ఏ రంగాల నిపుణులు ఉన్నారో?:

కోట్లాది మంది హిందువుల ఆరాధ్యదైవమైన సింహాచల క్షేత్రం

ట్రస్ట్ బోర్డు తీసుకోవాల్సిన నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యం అయి ఉండాలి, ఎటువంటి సమస్యలు తెలెత్తకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాల్సి ఉంది. అయితే ప్రస్తుత ట్రస్ట్ బోర్డు లో ఉన్న సభ్యులు ఏ ఏ రంగాల్లో నిపుణులో తెలియక పోవడంతో ఈ బోర్డు తీసుకునే నిర్ణయాలు సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నాయి. 

ప్రధానంగా

దేవస్థానంకు దాతలు ఇచ్చిన కోట్ల రూపాయలు విలువైన భూములను రాజకీయ నేతలకు అందించేందుకు సిద్ధపడడం, 
ఖాళీ స్థలాల్లో వాణిజ్య సముదాయాలు నిర్మించడం తో పాటు, గోశాలకు అనుబంధంగా ఉన్న కొన్ని ఎకరాలను ప్రముఖ నేతకు అప్పగించేందుకు చర్చకు రావడం గమనార్హం. 

ఆఖరికి ఓ ఎస్ డి నియామకాన్ని మాత్రం అంగీకరించి, మిగిలిన 11

అంశాలను ప్రక్కన పెట్టారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam