DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సచివాలయంలో కరోనా విజృంభణ, ఆందోళనలో ఉద్యోగులు

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 27, 2020 (డిఎన్ఎస్):* సచివాలయంలో కరోనా బారిన పడుతున్న ఉద్యోగుల జాబితా రోజు రోజుకు పెరిగిపోతుంది. నిన్న కాక మొన్న సుమారు 20 మందికి కరోనా వైరస్‍ బయట పడటంతో.. ఉద్యోగ వర్గాలలో ఆందోళన ఎక్కువ అవుతోంది. ఇంటి నుండి పని చేసేందుకు అనుమతి ఇవ్వండి.. మహా ప్రభో.. అని

అడుగుతున్నా పాలకులు ససేమిరా అంటున్నారు. తప్పనిసరిగా అందరూ సచివాలయంలో పనిచేయాల్సిందే అంటున్నారు. పాలకుల నిర్ణయాలను మేము అమలు చేయాల్సిందే తప్ప మా చేతుల్లో ఏమి ఉండదని.. అధికారులు చేతులెత్తేశారు. 
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానిని ఈ విషయంపై పదే పదే కలిశానని చెబుతున్నారు ఉద్యోగ సంఘనాయకులు. ఇదంతా.. అబద్దం..

మేడం గారిని ఉద్యోగ సంఘ నాయకులు ఎప్పుడైనా కలుస్తున్నారే.. తప్ప పదే పదే కలవటం లేదని.. అక్కడ పనిచేస్తున్న వారి ద్వారా బయటకు పొక్కింది. ఉద్యోగుల మంచి, చెడు చూడాల్సిన జిఎడి పొలిటికల్‍ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‍ ప్రకాష్‍ ముఖ్యమంత్రి నివాసానికే పరిమితమవుతున్నారు.

సచివాలయానికి రావటం లేదట. అధికారులను ఎన్ని

దఫాలు కలిసినా.. వృధాయే అని ముఖ్యమంత్రిని స్వయంగా ఉద్యోగ సంఘ నాయకులు కలిసి సమస్యను విన్నవిస్తే.. ఆయన మెత్తబడవచ్చు. పాలకులకు, సలహాదారులకు అత్యంత సన్నిహితులం అని చెప్పుకుంటున్న ఉద్యోగ సంఘ నాయకుడేమో.. తన వ్యక్తిగత ప్రాబల్యం కోసం తాపత్రయ పడుతున్నారని ఉద్యోగులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు స్పష్టంగా సచివాలయంలో

కనిపిస్తున్న నేపధ్యంలో కరోనా వైరస్‍ రోజు రోజుకు పెరిగిపోతున్నా.. బాధ్యత గల అధికారుల ఎవరూ ఉద్యోగుల బాధలపై దృష్టి పెట్టడం లేదు. సచివాలయానికి మంత్రులు ఎప్పటి నుండో రావటం లేదు. ముఖ్యమంత్రి సచివాలయానికి రావటం ఎప్పుడో మాని వేశారు. మంత్రి వర్గ సమావేశాల రోజు మాత్రమే సిఎంతో పాటు మంత్రులు సచివాలయానికి వస్తున్నారు. సిఎంవో

అధికారులు కూడా తాడేపల్లికే పరిమితమవుతున్నారట.

శాఖాదిపతులలో అతి కొద్ది మంది మినహా ముఖ్యమైన వారు ఎవరూ సచివాలయానికి రావటం లేదు. సచివాలయానికి రావాలంటే.. మంత్రులు, వారి ఆంతరంగిక సిబ్బంది, శాఖాదిపతులు హడలి పోతున్నారు. సచివాలయానికి రాకున్నా.. మంత్రులు కరోనా వైరస్‍ బారిన పడి చికిత్స చేయించుకుంటున్నారు.

మేముకరోనా బారిన పడితే.. ముఖ్య అధికారులు ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వెలగపూడిలో ఉన్న సచివాలయాన్ని విశాఖకు మారుస్తామంటున్నారు ముఖ్యమంత్రి. కోర్టు ఉత్తర్వులు లేకుంటే.. ఇప్పటికే సచివాలయాన్ని విశాఖకు తరలించేవారు. వెలగపూడి సచివాలయంలోనే కాదు. విశాఖ నగరంలో కూడా కరోనా ఉధృతి రోజు రోజుకు

పెరిగిపోతుందని… అధికార గణాంకాల వలన స్పష్టమవుతోంది. ఒకవైపు కరోనా టెన్షన్‍..మరోవైపు సచివాలయం తరలింపు ఉత్కంఠలతో మెజార్టీ ఉద్యోగులు చేసేది ఏమి లేక… ఎదురు తిరిగే వారు లేక.. బాధలు చెప్పుకున్నా.. వినేవారు లేక మౌనంగానే రోదిస్తూ.. ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలా అని భయాందోళనలతో వారు కనిపిస్తున్నారు.

/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam