DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాపులుప్పాడ లో 30 ఎకరాల స్టేట్ హౌస్ భూమికి అర్జెంట్ ఆదేశాలు  

*గ్రేహౌండ్స్ కు 300 ఎకరాల్లో 30 ఎకరాలు స్టేట్ గెస్ట్ హౌస్ కు కేటాయింపు*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 27, 2020 (డిఎన్ఎస్):* విశాఖపట్నంలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాలపై ఆదేశాలు జారీ చేసింది. విశాఖ సాగర తీరం లోని కాపులుప్పాడలోని  గ్రేహౌండ్స్ కు

చెందిన 300 ఎకరాల్లో 30 ఎకరాలు స్టేట్ గెస్ట్ హౌస్ కు కేటాయింపులు జరిపిన విషయం తెలిసిందే. దీనికై  స్థలం కేటాయింపుపై అవసరమైన రికార్డులను అత్యవసరంగా మార్పు చేయాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది. స్థలం కేటాయింపులు, ఇతర అంశాల్లో త్వరితగతిన ముందుకెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు విడుదలయ్యాయి. 
ఈ అత్యవసర ఉత్తర్వులు జారీ

చేసిన సాధారణ పరిపాలన శాఖ రాజకీయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పేరిట విడుదలయ్యాయి. 

కార్యనిర్వాహక రాజధాని విశాఖ కు తరలిపోతోంది అనుకున్న సమయంలో స్టేట్ హౌస్ కు ఈ భూములు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రాజధాని తరలింపు పై హైకోర్టు లో వాదప్రతివాదనలు జరుగుతున్నందున, ఈ అత్యవసర భూమి కేటాయింపులపై

అర్జెంట్ అనే ఆదేశాలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam