DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా పోరాట యోధులకు జిల్లా ఎస్పీ ఆత్మీయ స్వాగతం 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  ఆగస్టు 27, 2020 (డిఎన్ఎస్):* కరోనా రాక్షసుని బారిన పడి కోలుకుని ఆరోగ్యవంతులుగా విధులకు తిరిగి వచ్చిన కోవిడ్ పోరాట యోధులకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఎస్పీ అమిత్ బర్దార్ ఆత్మీయ స్వాగతం పలికారు. గురువారం ఎచ్చెర్ల ఆర్మడు  రిజెర్వ్ పోలీసు మైదానంలో

 53 మంది  పోలీసు  సిబ్బంది  కరోనా వైరస్ బారినపడి హోమ్ క్వారంటైన్, హాస్పిటల్లో ఉండీ చికిత్స అనంతరం కోవిడ్ నుంచి కొలుకోని విజయోతాస్సాహంతో విధులకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ  జిల్లాలో కమ్యూనిటీ సేవలు చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలు అట్టడుగు, బలహీన వర్గాలు కోసం

పనిచేస్తున్నాయన్నారు.  మీరు కూడా కరోనా  జయంచి ప్రజా సేవ, రక్షణ కోసం  విధుల్లోకి రావడం ఆనందదాయకమన్నారు. 
ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా మార్పుచెందుతూ వ్యవస్థలొ మార్పు తీసుకొస్తూ వ్యక్తిగతంగా గెలవాలని కోరారు. మీరుందరూ కరోనా అనే యుద్దంలో పోరాడి గెలుచిన వీరులుని, కానీ యుద్ధం  అనేది ఆగలేదని, కరోనా వైరస్ నియంత్రణ

లో  మీ అనుభవాలను తోటి వారితో పంచుకోవాలని కోరారు. 

కరోనా వైరస్ వ్యాపించే ప్రతీ ఒక్కరూ 28రోజులు హోమ్ ఐస్లోషన్ ఉంటూ వ్యక్తిగతముగా రక్షించుకున్నారన్నారు. అదేవిధంగా సమాజంలో ఉన్న లోపాలు సరిదిద్దుకొవలని, మన సీఎం, డీజీపీ ప్రతి ఒక్కరూ న్యాయం చేయాలని తెలియజేసారన్నారు. 
కుటంబం తో పాటు సమాజంను  రక్షించడం

కూడా మన బాధ్యతని, మంచి ఆలోచనలుతొ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ వైస్ చైర్మన్ సి. వి. రాజు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ch. కృష్ణ మోహన రావు, డి.ఏ.ఆర్ డిఎస్పీ ఎన్.ఎస్. ఎస్. శేఖర్, ఎస్బి సిఐ శంకరరావు, శ్రీకాకుళం 2 టౌన్ సిఐ పి. వి. రమణ , జె. ఆర్.

పురం సి.ఐ మలైశ్వరవు, ఆర్ఐ లు ప్రదిప్, ఉమా మహేష్, గారులు మరియు  రోటరీ, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam