DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనాసురుడి నుంచి రక్షణ కై ఇంటింటా ధన్వంతరి హోమం

*సప్తరుషి వేదపాఠశాల చే ఆన్ లైన్ లో వైదిక హోమ ప్రయోగం* 

*ప్రతి ఒక్కరూ పాల్గొనండి: వేదాచార్య మాధవశర్మ పిలుపు*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 28, 2020 (డిఎన్ఎస్):* ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనాసురుడి బారి నుంచి సమాజం లోని ప్రజలందరూ విముక్తి పొంది

రక్షించబడాలనే ఏకైక సంకల్పంతో ఇంటింటా ధన్వంతరి హోమం నిర్వహిస్తున్నట్టు సప్తరుషి వేదపాఠశాల ప్రధానాచార్యులు మావిళ్ళపల్లి మాధవ శర్మ తెలిపారు. విశాఖపట్నం శివారు ప్రాంతం సబ్బవరం లోని తమ వేదపాఠశాల నుంచి విద్యార్థులు, అధ్యాపకులచే ఆన్ లైన్ ద్వారా ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.  శుక్రవారం

ప్రారంభమైన ఈ కార్యక్రమం శని, అది వారాల్లోనూ కొనసాగుతుందన్నారు. ప్రతి గంట కు ఒక బృందం చొప్పున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకూ ఈ హోమ ప్రక్రియ సాగుతుందన్నారు. 
సమాజ శ్రేయస్సు కోరుకునే వారు ఈ ఆన్ లైన్ హోమం లో పాల్గొనవచ్చని తెలియచేసారు. ఎవరికీ వారు స్వయంగా హోమం తమ ఇంట్లో చేసుకునే విధంగా తాము శిక్షణ ఇవ్వడం

జరుగుతుందన్నారు. అగ్ని ప్రతిష్ఠా, మంత్రం హవనం, జపం చేసే విధానం ఇలా అన్ని ప్రక్రియలు నేర్పించి, వారు ఎలా చేస్తున్నారో కూడా పర్యవేక్షించి, సరిదిద్ది, వారిచే ఈ ఇంటింటా ధన్వంతరి హోమం చేయడం జరుగుతుందన్నారు. 
గత నాలుగు నెలల కరోనా లాక్ డౌన్ లో నిత్యా హోమం తమ పాఠశాలలో దివా రాత్రాలు నిర్వహించి, పేదలకు ఉదయం, సాయంత్రం అన్న

ప్రసాదాన్ని వారి కోలనీలకే వెళ్లి అందించామన్నారు. సర్వేజనా సుఖినో భవంతు అనే వేదవాక్కును ప్రతి బ్రాహ్మణుడు తప్పక పాటించాలని తెలియచేసారు. 

శుక్రవారం జరిగిన ప్రారంభ కార్యక్రమం లో వేద విద్యార్థులు, వివిధ ప్రాంతాలనుంచి భక్తులు పాల్గొన్నారు. ఈ ఇంటింటా హోమ ప్రక్రియ లో పాల్గొనదలచిన వారు తమ వాట్సాప్ నెంబర్

 94923 41294 ను సంప్రదించవచ్చని తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam